Sandra Venkata Veeraiah: కాంగ్రెస్పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sandra Venkata Veeraiah Fires On Congress Party: కాంగ్రెస్ పార్టీపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్.. అంతకుముందే అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజర్లో పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్న తరుణంలో, తప్పుడు పద్ధతిలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు.. పోడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
గతంలో పోడు సమస్యలను రాజకీయం కోసమో, ఎన్నికల కోసమో వాడుకున్నారని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాజకీయ స్వార్ధపరులు, అవకాశవాదులు ముందుకొచ్చి.. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులే కేసీఆర్కు శ్రీరామరక్షగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ కోణం లేకుండా, మానవీయ కోణంతోనే కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ వాళ్లు రూ.4000 పెన్షన్ ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో రూ.4000 పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం లేకుండా.. కులం, మతం లేకుండా.. పేదరికమే గీటు రాయిగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజల్ని కోరారు.
Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!