Shabbir Ali: సీఎం కేసీఆర్కు షబ్బీర్ అలీ ఛాలెంజ్.. దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali Challenges CM KCR Over Kaleshwaram Project Details: తెలంగాణ సీఎం కేసీఆర్కు మాజీమంత్రి షబ్బీర్ అలీ ఓ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెల్ల పేపర్పై ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ కనీవినీ ఎరుగని స్థాయిలో సక్సెస్ అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సభతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన వద్దు అని నిర్ణయించుకున్నారని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని.. ఒకటి ఏ టీం అయితే, మరొకటి బి టీంని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బిజెపి వాటా తీసుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రూ.34 వేల కోట్లకు డిజైన్ చేస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష 50 వేల కోట్లకు పెంచిందని పేర్కొన్నారు. పోడు భూములు కూడా.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు 56% ఇచ్చారని చెప్పారు. ఇక్కడ గంపను, అక్కడ సీఎం కేసీఆర్ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది
Also Read
- Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
- Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
- Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దాడి
అంతకుముందు కూడా సీఎం కేసీఆర్పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను సీఎం పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. గతంలో తెలంగాణలోని యూనివర్సిటీలు దేశంలోనే మొదటి, రెండు స్థానాల్లో ఉండేవని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక లిస్టులోనే లేకుండా పోయాయని తూర్పారపట్టారు. ఉమ్మడి ఏపీలో కొట్లాడి తీసుకొచ్చిన డెయిరీ టెక్నాలజీ సొంత రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని భావించామని.. కానీ అలా జరగలేదని మండిపడ్డారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, ప్రొఫెసర్లు కొరత ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఖమ్మం సభ బీఆర్ఎస్ నేతల్ని ఉలిక్కి పడేలా చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్పై మంత్రి హరీష్ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని.. 2004 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని, ఆ పార్టీకి రాజకీయ గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. తప్పుడు వాగ్ధానాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు.
Daggubati Purandeswari: షాక్లో ఏపీ బీజేపీ నేతలు.. పురంధేశ్వరికి బాధ్యతల వెనుక అసలు కారణం ఇదేనా..?
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!