Revanth Reddy: బీజేపీ+బీఆర్ఎస్=బై బై.. రేవంత్ రెడ్డి ధ్వజం
Revanth Reddy Fires On BJP KCR KTR Harish Rao In Pressmeet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ధ్వజమెత్తారు. బీజేపీ+బీఆర్ఎస్ = బైబై అంటూ సరికొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. తన నివాసంలో నిర్వహించిన ప్రెస్మీట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. సభను అడ్డుకోవడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా సరఫరా చేయకపోవడం సిగ్గుచేటంటూ విరుచుకుపడ్డారు.
Lift Harassment: దారుణం.. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకొని లైంగిక దాడి
Also Read
- Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
- KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
- Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ఖమ్మంలో ఉన్న సైకో మంత్రి సైకో విన్యాసాలన్ని చేశాడంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమ రాహుల్ గాంధీ పదవులను త్యాగం చేసిన నాయకుడు అని కొనియాడారు. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేపర్లు, టీవీలు, ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు రాహుల్ గాంధీని అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పర్యటించడానికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉంది? అని ప్రశ్నించారు. ఒకడు పిట్టల దోర, ఒకడు ట్విట్టర్ పిట్ట, ఒకడు సారా పోసే మంత్రి అంటూ విమర్శించారు. టేపు పట్టుకొని ఎంత హైట్ ఉన్నావో కోలుసుకున్నావా మంత్రి? అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై హరీష్ రావుతోనైనా, కేటీఆర్తోనైనా చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. తన సవాలును కేటీఆర్, హరీష్ స్వీకరిస్తారా? అని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాళేశ్వరం ‘వైట్ ఎలిఫెంట్’లాగా మారిందని పేర్కొన్నారు.
Black Magic: బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసం.. నగదు రెండింతలు చేస్తానని..
ఖమ్మం సభలో రాహుల్ గాంధీ ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే.. ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని రేవంత్ తేల్చి చెప్పారు. రాహుల్ని విమర్శిస్తే.. కేటీఆర్ ముఖంపై హరీష్.. హరీష్ మొహంపై కేటీఆర్ కాండ్రించి ఉమ్మేసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. 75 రూపాయలున్న పెన్షన్ను రూ.200 చేసింది తామేనని ఉద్ఘాటించారు. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసినా.. రూ.4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని, పథకాల్ని ఎలా అమలు చేయాలో తమకు బాగా తెలుసని చెప్పారు. రూ.4000 పెన్షన్పై అనుమానాలుంటే.. చర్చ పెట్టాలని, తాము అవగాహన కల్పిస్తామని అన్నారు. కేసీఆర్ అవినీతి ఆపేస్తే.. పథకాలకు డబ్బులు ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
-
Salman Khan-RR: సారీ భాయ్, ఈ రోజు కాదు.. సల్మాన్ ఖాన్ పోస్ట్కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో