మార్చి నెల వచ్చేస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాం. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో హైదరాబాద్ నుండి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ అయ్యింది.…
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ ఛుగ్. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నారు. ఇండియాకు ఎందుకు ఉక్రెయిన్, రష్యా లకు కేసీఆర్ అధ్యక్షుడు అవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందంట. మాకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి అవసరం లేదన్నారు తరుణ్ చుగ్. ఏ కిషోర్ లు కేసీఆర్ ని కాపాడలేరు. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. కుటుంబ…
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకోవడంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి.. మన గ్రాఫ్ పెరుగుతుంది.. సీఎం కేసీఆర్ గ్రాఫ్ తగ్గుతుందన్న ఆమె.. ట్యూషన్ టీచర్ని ఎందుకు పెడతాం..? పిల్లలు వీక్గా ఉంటేనే కదా..? అని ప్రశ్నించారు.. అంటే కేసీఆర్ వీక్ అయ్యాడు కాబట్టే.. ట్యూషన్ టీచర్ని తెచ్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు గీతారెడ్డి.. ఇక, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు..…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్ తయారుచేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారాముల దర్శించుకున్న ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై ధ్వజం ఎత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఆయన విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ, ఉద్యోగ నోటిఫికేషన్లు, రెండు పడక గదుల ఇల్లు, దళిత…
తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందన్నారు.. కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను నిర్విర్యం చేస్తూ ప్రైవేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆరోపించిన ఆయన.. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల పాఠశాలలు బలోపేతం…
అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్సే.…
పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, ప్రతి కార్యకర్త ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని ఆయన అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఆ రాష్ట్ర నాయకులు సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ ఒక్క రాష్ట్రం సక్సెస్ కాలేదన్నారు. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువే…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ.. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. 42 మంది ఎమ్మెల్యే లతో తెలంగాణ కోసం లేఖ రాసింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని ఆయన అన్నారు. కోట్లాడిన వాళ్ళకే బీ ఫామ్ అని, కోటా లేదు..వాటా లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. కొట్లాటలో ఉన్నోళ్లకే టికెట్లు.. ఇంటికి తెచ్చి ఇస్తానని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం…
సీఎం కేసీఆర్ ఎంతో సదుద్దేశంతో ప్రారంభించిన టీఎస్ బీపాస్ గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఎస్ బీపాస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల అమలు కోసం పట్టణాలు, పంచాయితీలు, స్ధానిక సంస్థల పరిధిలో జనన, మరణాలను ఖచ్చితంగా నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనన, మరణాలను వందశాతం నమోదు…