Contonment Seat: కుమ్ములాటలు.. సాయన్నకు తలనొప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడ అధికారపార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ.. మూడు కార్పొరేషన్ల ఛైర్మన్లు మాత్రం ఏవేవో లెక్కలు వేసుకుని టికెట్ కోసం ట్రయిల్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గం కావడంతో అధికారపార్టీ నేతల ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాల్లో మలుపులు ఉంటాయా?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఇక్కడ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్సే. ప్రస్తుతం ఈ నియోజకవర్గం టీఆర్ఎస్లో హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తూ చాలామంది ఎస్సీ నేతలు కంటోన్మెంట్ వైపు ఆశగా చూస్తున్నారు. ఎమ్మెల్యేగా సాయన్న ఉన్నప్పటికీ అక్కడ పట్టు సాధించే దిశగా ఆ నాయకులు పావులు కదుపుతున్నారట. దీంతో కామ్గా ఉన్న కంటోన్మెంట్ రాజకీయం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ కేడర్లో నెలకొంది.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఎత్తుగడలు
కంటోన్మెంట్పై టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు నేతలు కన్నేశారట. ఆ ముగ్గురికీ ఇటీవలే రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. వాళ్లే ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నే క్రిశాంక్, గజ్జెల నగేష్. వీరిలో గజ్జెల నగేష్ గతంలో టీఆర్ఎస్ నుంచి కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్ లెక్కలు వేరే ఉన్నాయి. రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గం.. బలమైన కేడర్ ఉండటంతో గట్టి లాబీయింగే చేస్తున్నారట. మన్నే క్రిశాంక్ సైతం బలం చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కంటోన్మెంట్లో కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఆధిపత్యం కోసం భారీ స్కెచ్లే వేస్తున్నారట.
ఎమ్మెల్యే సాయన్నకు పక్కలో బల్లెంలా నేతలు?
తాజా పరిణామాలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు మింగుడు పడటం లేదట. ఆశావహులంతా ఆయనకు పక్కలో బల్లెంలా మారినట్టు కేడర్ చెవులు కొరుక్కుంటోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో సాయన్న పోటీ చేయకుండా.. తన వారసుల కోసం టికెట్ అడిగితే ఏం జరుగుతుందనే ప్రశ్నలు ఉన్నాయి. ప్రస్తుతమైతే నేతల ప్రయత్నాలపై ఎలాంటి కామెంట్స్ చేయకుండా.. అంతా కామ్గా గమనిస్తున్నారట. దీంతో అసెంబ్లీ ఎన్నికల నాటికి కంటోన్మెంట్ టీఆర్ఎస్ రాజకీయాలు రసవత్తరంగా మారతాయని అనుకుంటున్నారు. కుమ్ములాటలు మొదలైతే రచ్చ రచ్చ అవడం కాయం. మరి.. కంటోన్మెంట్ టీఆర్ఎస్లో సాయన్న పట్టు నిలుపుకొంటారో.. కొత్త వాళ్లు పాగా వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
-
Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
-
MS Dhoni: ప్లేయర్ కాస్త కోచ్.? చెన్నై సూపర్ కింగ్స్కు కోచ్గా మిస్టర్ కూల్.!
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!