బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర…
ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డిజీల్ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని,…
ఏపీలో ఇళ్ల పట్టాలు సహా 16 పథకాలకు అర్హులైనా లబ్దిపొందని వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు ఏపీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.
ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ…
ఏపీలో ఓటీఎస్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సీఎస్ సమీర్ శర్మ 14.29 ఫిట్మెంట్తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్కు అందజేశారు. అయితే సీఎస్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్లు పలుమార్లు ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై…
ఏపీలో నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి. అర్హులై వివిధ కారణాల వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేక పోయిన వారు అనేక మంది వున్నారు. వారిని దృష్టిలో వుంచుకుని లబ్ది చేయనున్నారు సీఎం జగన్ . అర్హులై పథకాలు పొందలేక పోతున్న వారి దరఖాస్తుల పరిశీలనకు రంగం సిద్ధం అయింది. ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో సంక్షేమ పథకాల లబ్ధి అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ…
కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..బుధవారం సీఎం జగన్ చేతుల మీదుగా పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే ఇది విజయవంతంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జగనన్న పాలవెల్లువ ప్రారంభిచడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలో 9 మండలాలను గుర్తించామన్నారు.…
ఏపీ ప్రభుత్వం ఇటీవల వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటీఎస్పై టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నాయి. అయితే తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఓటీఆఎస్ను రద్దు చేయాలంటూ కలేక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారిని జగన్ దోపిడీ చేస్తున్నాడని ఆయన అన్నారు.…
పేదలకు మేలు చేసే ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి. ఓటీఎస్ పై ప్రతిపక్షం, వారికి అనుకూలంగా ఉన్న మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒక సంస్కరణ లో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఓటీఎస్ ను తెచ్చారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నాం. పట్టా ద్వారా తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒక రూపాయి కూడా లేకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుంది. ప్రభుత్వం ఓటీఎస్…