బీజేపీది ప్రజాగ్రహ సభ కాదు.. జగన్ అను గ్రహ సభ : పయ్యావుల కేశవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న బీజేపీకి ఏపీలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందని, రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని, ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదని ఆయన అన్నారు. కేంద్రం టెలిస్కోప్ లో రాష్ట్ర రాజకీయలను చూస్తుందని కేంద్ర మంత్రి ఒకరు అన్నారని, కానీ ఇక్కడ సినిమా స్కోపీలోనే అన్యాయం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు.
విజయడవాడలో బీజేపీ నిర్వహిస్తున్నది ప్రజాగ్రహ సభ కాదు జగన్ అను గ్రహ సభ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చైనాలో ఉన్న కోవిడ్ కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏపీలోని జగన్ అనే వైరస్ కు కేంద్రం వ్యాక్సిన్ వేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిందూ దేవాలయలకు ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజు మీద దాడి జరిగినా బీజేపీ నాయకులు ఒక్క మాట కూడా అనలేదని, బాబాయ్ హత్య మీద ఇవాళ్టికి విచారణ లేదని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలు పోలీసులు అరాచకాలు పై విచారణ చేయించండి ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ఏపీ బీజేపీ ప్రభుత్వం కు అనుకూలంగా పనిచేస్తోందని, కేంద్ర నిధులతో వచ్చిన పథకాలకు కూడా జగన్ పేరు పెట్టుకున్నా ఏపీ బీజేపీ నాయకులకు నోరు మెదపడం లేదన్నారు.
Also Read
తాజావార్తలు
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
-
KKR Vs GT: పక్కా వ్యూహంతో బరిలోకి కోల్కతా నైట్ రైడర్స్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జీటీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..