ఏపీలో ఓటీఎస్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని టీడీపీ శ్రేణులు బ్రహ్మాండంగా పోరాడారు. మీ పోరాటానికి నా అభినందనలు. ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతున్న మా పార్టీ నేతలపై పోలీసులు పలుచోట్ల అన్యాయంగా విరుచకుపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పీల్చుకుతింటున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పేదల పక్షాన టీడీపీ పోరాడుతుందన్నారు అచ్చెన్నాయుడు.