Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే….?
- టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్కు భారీ బహుమతి
- రన్నరప్, సెమీఫైనల్ జట్లకు ఐసీసీ ప్రైజ్ మనీ
- గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు తక్కువ మొత్తం
- టీమ్ ఇండియాకు బీసీసీఐ నుంచి రూ.131 కోట్ల నజరానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prize Money : 2026 టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 103 కోట్లు) పూల్ నుండి జట్ల ప్రదర్శన ఆధారంగా నిధులను కేటాయించారు.
TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
Also Read
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీని ముద్దాడిన టీమ్ ఇండియాకు ఐసీసీ నుండి మొత్తం 2.63 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 24.25 కోట్లు) లభించాయి. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచినందుకు లభించిన బోనస్లు, ఫైనల్ విజేతగా దక్కిన మొత్తం కలిపి భారత్ ఈ భారీ పారితోషికాన్ని అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.08 కోట్లు) దక్కాయి. సెమీఫైనల్ వరకు చేరిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా రూ. 9.24 కోట్లు, రూ. 8.96 కోట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు, గ్రూప్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ. 4.80 కోట్లు మాత్రమే లభించాయి.
ఐసీసీ అందించిన బహుమతి కంటే రెట్టింపు స్థాయిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచినందుకు గానూ టీమ్ ఇండియా ఆటగాళ్లు , సహాయక సిబ్బందికి కలిపి రూ. 131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. భారత క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు ప్రకటించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం గమనార్హం. కేవలం ఆటగాళ్లకే కాకుండా, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ మొత్తంలో భాగం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ భారీ ప్రోత్సాహకాలతో భారత క్రికెట్ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Cargo Ship Attacked: హార్ముజ్లో భారత్ వస్తున్న కార్గో షిప్పై అటాక్..
తాజావార్తలు
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!