Prize Money : 2026 టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 103 కోట్లు) పూల్ నుండి జట్ల ప్రదర్శన ఆధారంగా నిధులను కేటాయించారు.
TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీని ముద్దాడిన టీమ్ ఇండియాకు ఐసీసీ నుండి మొత్తం 2.63 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 24.25 కోట్లు) లభించాయి. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచినందుకు లభించిన బోనస్లు, ఫైనల్ విజేతగా దక్కిన మొత్తం కలిపి భారత్ ఈ భారీ పారితోషికాన్ని అందుకుంది. ఇక రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 1.42 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 13.08 కోట్లు) దక్కాయి. సెమీఫైనల్ వరకు చేరిన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు వరుసగా రూ. 9.24 కోట్లు, రూ. 8.96 కోట్లను తమ ఖాతాలో వేసుకున్నాయి. మరోవైపు, గ్రూప్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ జట్టుకు కేవలం రూ. 4.80 కోట్లు మాత్రమే లభించాయి.
ఐసీసీ అందించిన బహుమతి కంటే రెట్టింపు స్థాయిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచినందుకు గానూ టీమ్ ఇండియా ఆటగాళ్లు , సహాయక సిబ్బందికి కలిపి రూ. 131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. భారత క్రికెట్ చరిత్రలో ఒక జట్టుకు ప్రకటించిన అత్యధిక బహుమతి మొత్తం ఇదే కావడం గమనార్హం. కేవలం ఆటగాళ్లకే కాకుండా, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ మొత్తంలో భాగం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ భారీ ప్రోత్సాహకాలతో భారత క్రికెట్ వర్గాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
Cargo Ship Attacked: హార్ముజ్లో భారత్ వస్తున్న కార్గో షిప్పై అటాక్..