ఏపీలో బీజేపీ-వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.జగన్ ఢిల్లీలో చెంచాగిరీ చేస్తున్నారు.. ఏపీలో దాదాగిరి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఆడే మైండ్ గేమ్ ఏంటో బీజేపీకి అర్ధం చేసుకోని పరిస్థితుల్లో లేదు. సీఎం జగన్ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్రం సముచిత నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా బిర్యానీ లాంటిది.. ప్రత్యేక ప్యాకేజీ బఫే లాంటిదన్నారు ఆదినారాయణ రెడ్డి. బఫేలో అన్ని రకాల ఐటెములు ఉంటాయి. ఎస్పీవీ పెట్టి ప్యాకేజీ ద్వారా నిధులు తెచ్చుకోమని కేంద్రం చెబితే దాన్ని తప్పు పడుతున్నారు. మెడలు వంచుతానన్న జగన్.. ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారు.
వైసీపీది చేతకానితనం. ప్యాకేజీని వాడుకుంటే ఎంతైనా నిధులు వస్తాయి. పద్మనాభ స్వామి గుళ్లో నేల మాళిగలున్నట్టు.. జగన్ వద్ద అనేక నేల మాళిగలు ఉన్నాయి. జగన్ ఆశ తీరదు.. ప్రధాని కావాల్సిన వ్యక్తి జగన్ అంటూ ఆ పార్టీ నేతలంటున్నారు. వైసీపీకి చేత కావడం లేదన్నారు ఆదినారాయణ రెడ్డి. మరో నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడేది తామే అన్నారు. ఈ సభ వైసీపీ ప్రభుత్వంపై పోరాటానికి తొలి మెట్టు. ప్రాంతీయ పార్టీలు ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడ్డం అలవాటే. కొడాలి నాని మమ్మల్ని విమర్శలు చేస్తున్నారు.. ఆ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి సాగిలపడతారు.