Turkey Supports Iran: ఇరాన్కు బహిరంగ మద్దతు ప్రకటించిన ముస్లిం దేశం.. ఇప్పుడు అమెరికాతో యుద్ధం చేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkey Supports Iran: ఇరాన్ – అమెరికా & ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సరికొత్త మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన టర్కీ, తొలిసారిగా ఇరాన్కు తన బహిరంగ మద్దతును ప్రకటించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
సున్నీ-షియా విభేదాలు లేవు.. మనమంతా ఒక్కటే..
అంకారాలో తన పార్టీ ఎంపీలతో జరిగిన రహస్య సమావేశంలో ఎర్డోగన్ కీలక ప్రసంగం చేశారు. “నేను సున్నీని కాదు, వారు (ఇరాన్) షియా కాదు.. మనమందరం ముస్లింలం. ఇది మనమంతా ఏకమవ్వాల్సిన సమయం” అని ఆయన పిలుపునిచ్చారు. సంక్షోభ సమయాల్లో తన సోదర దేశాలకు దూరం అయ్యే వ్యక్తిని తాను కాదని, యుద్ధాన్ని ఆపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
యుద్ధానికి కారణం ఇజ్రాయెలే..
‘డైలీ సబా’ నివేదిక ప్రకారం, ఈ యుద్ధానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అని ఎర్డోగన్ విమర్శించారు. “యుద్ధం ఇజ్రాయెల్ వల్లే మొదలైంది, వారే దీనిని ఆపాలి. ఒకవేళ అమెరికా దౌత్యానికి ప్రాధాన్యత ఇస్తే యుద్ధం ముగుస్తుంది, ఇందులో టర్కీ మధ్యవర్తిగా చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది” అని ఆయన పేర్కొన్నారు. టర్కీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ మాట్లాడుతూ.. టర్కీ కూడా ఇరాన్ మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు. హమాస్, ఖతార్, సిరియాలతో కలిసి టర్కీ ఒక కొత్త ‘సున్నీ ముస్లిం’ కూటమిని ఏర్పాటు చేస్తోందని, దీని లక్ష్యం ఇజ్రాయెల్కు హాని కలిగించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ దూకుడుగా దాడి చేయని ఏకైక దేశం టర్కీ కావడం గమనార్హం. టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, ఇతర మంత్రులు ఎంపీలకు ఈ సంక్షోభంపై రహస్య సమాచారాన్ని అందించారు. ఇరాన్లో జరుగుతున్న మరణాలను గాజా ఊచకోతతో పోల్చిన టర్కీ పార్లమెంట్ స్పీకర్, అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే తాము మౌనంగా ఉండలేమని తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఎర్డోగన్ అటు ఇరాన్, ఇటు అమెరికా మధ్య రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, టర్కీ బహిరంగంగా ఇరాన్ పక్షాన నిలబడటం మధ్యప్రాచ్య యుద్ధ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Trump Reliance Deal: సాహో భారత్.. అమెరికా గడ్డపై చరిత్ర సృష్టించిన రిలయన్స్!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!