LPG Cylinder: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్రం శుభవార్త.. ఇక కష్టాలు తప్పినట్లే…
- వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..
- బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ..
- గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటమే కాకుండా.. పంపిణీ ఆలస్యమవుతుండటంతో జనాల్లో ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా మార్గాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయన్న వార్తలతో.. అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా అన్న భయం జనాలకు గురిచేసింది. చాలా మంది ముందు జాగ్రత్తగా బుకింగ్లు చేసుకుంటూ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల భయాందోళనలను పటాపంచలు చేస్తూ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Also Read
- SBI Mutual Fund IPO: ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ IPOకు సెబీ గ్రీన్ సిగ్నల్.. రూ.13,000 కోట్లతో మార్కెట్లోకి
- Prices Hike : దేశం కొంపముంచనున్న వర్షాలు.. నిత్యావసర ధరలు పెరుగుతాయా?
- Reliance AGM 2026: జియో IPO నుంచి AI, 2 లక్షల ఉద్యోగాల వరకు.. ముఖేష్ అంబానీ 10 కీలక ప్రకటనలు
- PhonePe: ఫోన్పే వాడితే రూ.100 కట్.. ఎలాగో తెలుసా?
ప్రస్తుతం నెలకొన్న కొరత తాత్కాలికమేనని, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కేంద్రం పేర్కొంది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల ప్రజలు గంటల తరబడి ఏజెన్సీల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. డిమాండ్కు తగ్గట్టుగా ఎల్పీజీ (LPG) ఉత్పత్తిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. అంటే గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
Also Read:Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..
దీనికి తోడు.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు దిగుమతులను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. హార్మూజ్ జలసంధి గుండా సరఫరా నిలిచిపోయినా.. ఆ రూట్తో సంబంధం లేని ఇతర మార్గాల ద్వారా అంతకుమించి చమురును సేకరిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. భారత్కు అవసరమైన గ్యాస్ నిల్వలను సమకూర్చడానికి త్వరలోనే రెండు భారీ ఎల్ఎన్జీ కార్గోలు దేశానికి చేరనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో పరిశ్రమలకు, గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా.. కృత్రిమ కొరత సృష్టించే వారిపై నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. సామాన్యుల ఆవేదనను గుర్తించిన కేంద్రం, యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టడం నిజంగా గ్రేట్ రిలీఫ్ అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
-
Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
-
Bangladesh: బంగ్లాదేశ్లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
-
KL Rahul: రాహుల్ను ల్యాబ్లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
-
Tollywood: పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!