మరోసారి చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్ల పై ఫైర్ అయ్యారు.. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంభిస్తుందని విమర్శించారు.. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.. అదానీ కంపెనీతో పాటుగా మరో మూడు కంపెనీలకు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారు .. స్మార్ట్ మీటర్లు..…
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు... జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది..
ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం! ఖర్గే మంతనాలు జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితం విడుదల కానుంది. ఇక ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగా ఈ…
కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే.. కేటీఆర్తో గ్యాప్పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై…
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
Minister Kollu Ravindra: ఏపీలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు బీసీల కృతజ్ఞత ర్యాలీలు జరగనున్నాయి. కూటమి ప్రభుత్వం బీసీలకు చేసిన సంక్షేమంపై చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పిస్తారా..? లేదా..? మార్చిలోనే MLC అయ్యారు నాగబాబు. ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని 2024 డిసెంబర్లోనే ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి ఎందుకు ఇంత ఆలస్యం. నాగబాబు అమాత్య యోగానికి అడ్డం ఏంటీ..? పవన్ కళ్యాణ్కు వేరే ఆలోచన ఏమైనా ఉందా..?
ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ... ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు..
చేనేతలో కొత్త డిజైన్లపై శిక్షణ ఇప్పించి ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకుంటాం.. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200యూనిట్లు, పవర్ లూమ్ కు 500యూనిట్లు ఉచితంగా ఇస్తాం.. 5 శాతం జీఎస్టీని రీయింబర్స్ చేస్తాం.. 50 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తాం.. అమరాతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఆగస్టు 7న) గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.