Stree Shakti Scheme: స్త్రీ శక్తికి శ్రీకారం.. బస్సులో సరదా సంభాషణ
- స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం..
- బస్సులో నేతల మధ్య సరదా సంభాషణ..
- బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్న సీఎం..
- డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎంను ఆపిన లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stree Shakti Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు శుభవార్త చెబుతూ.. స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఈ సందర్భంగా బస్సులో సరదా సంభాషణ ఇప్పుడు వైరల్గా మారిపోయింది.. బస్సు ఎక్కగానే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆపిన మంత్రి నారా లోకేష్ .. నా నియోజకవర్గానికి వచ్చారు.. నలుగురికి నేనే టికెట్ తీస్తాను అన్నా.. అంటూ పవన్ను ఆపారు లోకేష్.. తాను డబ్బులు ఇచ్చి సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కండక్టర్ కు చెప్పారు నారా లోకేష్. అంతేకాదు.. మంగళగిరిలో బస్సు టికెట్ డబ్బులు నేనిచ్చాను.. మీ నుండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకుంటా అంటూ సరదాగా మాట్లాడారు నారా లోకేష్.
Read Also: Collie : 24 గంటల్లోనే ఊహించని టికెట్ బుకింగ్స్ – రికార్డులు తిరగరాసిన ‘కూలీ’
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారిపోయింది. మరోవైపు, బస్సు ప్రయాణంలో.. వెనకాల నుంచి మాటల సౌండ్ రావడంతో. సీఎం చంద్రబాబు.. ఎవరూ అని అడగడం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వెనకాల ఉన్న లోకేష్ అని చెప్పారంటూ.. వారి ప్రయాణం మొత్తం సరదాగా సాగిందని.. కూటమి నేతల మధ్య.. ఎలాంటి భేషజాలు లేకుండా.. అంతూ సరదాగా బస్సులో ప్రయాణం చేశారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. ఇక, అమరావతిలోని ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వరకు సీఎం చంద్రబాబు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా సీఎం చంద్రబాబు, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే, రోడ్లకు ఇరువైపులా నిలబడి ఉన్న ప్రజలకు, మహిళలకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్.. ఇతర ప్రజాప్రతినిధుల ప్రయాణం కొనసాగింది..
తాజావార్తలు
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!