మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి తన నివాసంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కోసం పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వీడియోను చిరు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. “దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన పివి సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది” అంటూ పీవీ సింధుకు సెల్యూట్…
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ వేడుకకు అక్కినేని నాగార్జునతో పాటు రాధిక, సుహాసిని సహా మెగా కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై సింధును సన్మానించారు. ఈమేరకు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వీడియో షేర్ చేశారు. పీవీ సింధు ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం సాధించింది. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.…
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఆయనకు విషెస్ తెలిపేందుకు తిరుపతి అలిపిరి నుంచి ఈశ్వరయ్య అనే వీరాభిమాని సైకిల్ యాత్ర చేపట్టి 12 రోజులు ప్రయాణించి చిరంజీవిని కలిశారు. అలాగే తమ్ముడు పవన్ కల్యాణ్ ని కలవాలని అడిగిన ఆ అభిమానికి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు చిరు. అనంతరం ‘భీమ్లా నాయక్’ సెట్ లో పవన్ ను కలిశాడు. ఈ సందర్భంగా చిరంజీవి ‘తనను కలిసేందుకు అభిమానికి…
చిరంజీవి, కె.యస్. రామారావు కాంబినేషన్ అనగానే గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్స్ గుర్తుకు వస్తాయి. ‘అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, స్టువార్టుపురం పోలీస్ స్టేషన్’ వంటి సినిమాలు వీరి కలయిలో రూపొందాయి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరి కలయికలో సినిమా రాబోతోంది. 1991లో వచ్చిన ‘స్టూవార్ట్ పురం పోలీస్ స్టేషన్’ తర్వాత వస్తున్న సినిమా ఇది. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవితో సినిమా చేయాలని తాపత్రయపడుతున్న కె.యస్.రామారావు కోరిక నెరవేరనుంది. ఇటీవల కాలంలో…
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ ఓ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ వీడియోలో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ లేకపోవడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీనిని కూడా సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తండ్రి అల్లు…
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు, మల్టీ స్టారర్ సినిమాల పోకడ కనిపిస్తోంది. అరుదైన కలయికతో సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా తమ పరిధిని, మార్కెట్ ను పెంచుకుంటారు. తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం టాలీవుడ్ సినిమాపై కన్నేశాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసేందుకు సిద్ధమైయ్యాడు. ప్రస్తుతం చిరు ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సినిమాలు చేయనున్నాడు.మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ఫాదర్’.. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ (పరిశీలన టైటిల్).. మెహర్ రమేష్తో ‘బోళా శంకర్’ సినిమాలు…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో లో ఆయన ఉంటే ప్రాణమిచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ సంఖ్య కూడా ఎక్కువే. నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ అభిమానాన్ని విభిన్నంగా చాటుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో తమిళనాడుకు చెందిన అభిమానులు చేసిన వినూత్న ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు…
తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయన ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్ గా లేనప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా బండ్ల గణేష్ తన కొత్త డిమాండ్ తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మాట్లాడటానికి అభిమానులు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్ను నిర్వహించారు. అందులో దర్శకులు, నటీనటులు మరియు నిర్మాతలతో సహా పలువురు సినీ…