మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్…
కష్టాల కడలిలో ఉన్న తారలను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందువరసలో ఉంటూ వస్తున్నారు. పలు తెలుగు సినిమాలలో ప్రత్యేకించి చిరంజీవి సినిమాలు ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు’ తదితర చిత్రాల్లో విలన్ గా, ఫైటర్ గా నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం రెండు లక్షలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు బదిలీ చేశారు. పొన్నాంబళం చెన్నైలో ఉంటూ కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న లాక్డౌన్ చర్యల వల్ల కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్లో ఆక్సిజన్ అందక చాలా మంది తనువు చాలిస్తున్నారు. కాగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జిల్లా స్థాయిలో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కు అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అనారో సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే… మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ విందు ఏర్పాటు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ మెగాస్టార్ ను తరచూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి గత ఏడాది మార్చి 25న ఉగాది శుభ దినాన ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ట్విట్టర్లో చేరిన రెండు రోజుల్లోనే మెగాస్టార్ ట్విట్టర్ ఖాతాను చాలామంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్…
కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్.…
ఈద్-అల్-ఫితర్ ను సాధారణంగా ఈద్ అని పిలుస్తారు. ఈ పండుగ రోజును దేశంలోని ముస్లిం సోదరులు సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ శుభ దినం ఇస్లామిక్ నెల షావ్వాల్ ఇరవై తొమ్మిదవ లేదా ముప్పయ్యవ రోజున పాటిస్తారు. రంజాన్ నెల మొత్తం ఉపవాసం చేసి, పవిత్ర మాసం చివరి రోజున రంజాన్ పండుగను జరుపుకుంటారు. దీనిని ఈద్ అని పిలుస్తారు. టాలీవుడ్ ప్రముఖులు ఈద్ సందర్భంగా ముస్లిం సోదరులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి, మోహన్…
‘ఆచార్య’ తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’ రీమేక్. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా అప్ కమింగ్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లలో ఒకటి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతుందని భావించారు. ఆ తర్వాత వివి వినాయక్ పేరు వినిపించింది. ఎందుకో ఏమో తను కూడా తప్పుకున్నాడు.…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే లాక్ డౌన్ కూడా ప్రకటించారు. అయినా కొంత మంది ఊసుపోక వీధుల్లో తిరుగుతున్నారు. ఇక ఎంతో మంది జనాలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ… ‘ఈ వైరస్ నుండి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతోంది. అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు రాకండి. తప్పని సరిగా మాస్క్ ధరించండి. వీలైతే…
కరోనా పాజిటీవ్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఎన్టీఆర్ ను ఫోన్ లో పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. చిరంజీవి తమ హీరోని…