ఎదురులేని ప్రజానాయకుడు, తిరుగులేని కథానాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారకరామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. “ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ…
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం,…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా తర్వాత చిరు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ కాగా, వేదాళం రీమేక్ మరొకటి, బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ మూడవది. కాగా వేదాళం తమిళ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ ఏడాదే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో బిగ్బాస్ 4′…
మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, మెగా పవర్ స్టార్ చరణ్ సరసన పూజా హెగ్డే జోడీగా నటిస్తుంది. ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే చరణ్ నిడివి ఉంటుందనీ, జస్ట్ గెస్ట్ రోల్ అనే టాక్ వచ్చింది. అయితే తాజాగా కొరటాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో చరణ్ చేస్తున్నది గెస్ట్ రోల్ కాదని, ఆయన పాత్రకు…
మే 24 ఇంటర్నేషనల్ బ్రదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు తమ తమ బ్రదర్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు సైతం సోదరుల పట్ల ఉన్న ప్రేమ చాటుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే సందర్భంగా తన తమ్ముళ్ళతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చిన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ బ్లాక్…
కష్టాల కడలిలో ఉన్న తారలను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి ముందువరసలో ఉంటూ వస్తున్నారు. పలు తెలుగు సినిమాలలో ప్రత్యేకించి చిరంజీవి సినిమాలు ‘ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్లు’ తదితర చిత్రాల్లో విలన్ గా, ఫైటర్ గా నటించిన పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇది తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన కిడ్నీ మార్పిడి కోసం రెండు లక్షలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు బదిలీ చేశారు. పొన్నాంబళం చెన్నైలో ఉంటూ కిడ్నీ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. చిరంజీవి…
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న లాక్డౌన్ చర్యల వల్ల కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా కరోనా రెండో వేవ్లో ఆక్సిజన్ అందక చాలా మంది తనువు చాలిస్తున్నారు. కాగా కరోనా బాధితులకు అండగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజన్ కొరత దృష్ట్యా చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో జిల్లా స్థాయిలో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కు అభిమానుల నుంచి సెలెబ్రిటీల వరకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అనారో సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే… మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎన్టీఆర్ కు సర్ప్రైజ్ విందు ఏర్పాటు చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి…
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ మెగాస్టార్ ను తరచూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. చిరంజీవి గత ఏడాది మార్చి 25న ఉగాది శుభ దినాన ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. వాస్తవానికి ట్విట్టర్లో చేరిన రెండు రోజుల్లోనే మెగాస్టార్ ట్విట్టర్ ఖాతాను చాలామంది ఫాలోవర్స్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్…