సీఎంతో సినీ పెద్దల భేటీకి టైం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినిమా పెద్దలు భేటీ కానున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎంఓ నుంచి సినీ సమస్యలపై చర్చించడానికి సినీ పెద్దలకు ఆహ్వానం అందింది. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధి బృందం సెప్టెంబర్ మొదటి వారంలో సీఎంతో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. అయితే నిన్నటి నుంచి ఈ సమావేశం వాయిదా పడిందని, సీఎం జగన్ ఫ్యామిలీతో కలిసి హాలిడేలో ఉండడమే దీనికి కారణమని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ రూమర్స్ అని స్పష్టం అవుతోంది. టాలీవుడ్ ప్రతినిధులు సెప్టెంబర్ 4వ తేదీన జగన్తో సమావేశం కానున్నారని తెలుస్తోంది.
Read Also : “నో వర్డ్స్” మామ… నాగ్ కు సామ్ విషెస్
Also Read
- Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- Basil Joseph: లుక్ కోసం 15 కేజీలు తగ్గిన మలయాళం హీరో
- Kalki Part 2: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ అప్పుడేనా? నాగ్ అశ్విన్ ప్లాన్ మామూలుగా లేదుగా!
- OTT Releases This Week: ఈ వారం సౌత్ ఓటీటీ మూవీస్ అన్నీ భలే ఉన్నాయే!
సినిమా హాళ్లలో టికెట్ ధరలు, థియేటర్ మేనేజ్మెంట్లకు సబ్సిడీలు, పంపిణీదారులకు పన్ను మినహాయింపు వంటి అనేక ముఖ్యమైన అంశాలు సమావేశంలో చర్చించనున్నారు. లవ్ స్టోరీ, ఆచార్య, అఖండ వంటి చిత్రాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల పరిమితి కారణంగా విడుదల తేదీని ఆపేస్తూ వచ్చారు. సీఎం జగన్ టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతించి, నైట్ కర్ఫ్యూ నిబంధనను సడలించినట్లయితే రాబోయే రెండు నెలల్లో థియేటర్లలో భారీ సినిమాలు విడుదల అవుతాయి. సెప్టెంబర్ 4న జరగాల్సిన టాలీవుడ్ ప్రతినిధి బృందంతో జగన్ భేటీపై ఈ అంశాలన్నీ ఆధారపడి ఉన్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..