YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!
- నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
- పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న వైసీపీ
- పార్టీ జెండాను ఆవిష్కరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. 2011 మార్చి 12న స్థాపించబడిన వైసీపీ.. ఇప్పుడు 16వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపన సమయంలో తాను ఒక్కడినే ఉన్నానని, కానీ ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ ఒక పెద్ద శక్తిగా ఎదిగిందని చెప్పారు. ‘నల్లకాల్వలో ఇచ్చిన మాటే పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమైంది. ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చింది’ అని పేర్కొన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన ఆశయాలను కొనసాగిస్తానని, ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ నల్లకాల్వలో ఇచ్చిన మాట (ఓదార్పు యాత్ర) ఆ పార్టీ స్థాపనకు పునాది వేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ అడ్డు చెప్పడంతో.. ఇచ్చిన మాట కోసం ఆ పార్టీని వదిలి, వైయస్సార్సీపీని జగన్ స్థాపించారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Also Read: Gambhir vs Agarkar: గంభీర్-అగార్కర్ మధ్య విభేదాలు.. కారణం ఆ స్టార్ ఆటగాడే!
‘అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా ప్రజల కోసం పోరాటం చేశా. మొదటి నుంచీ ప్రజలు, దేవుడ్నే నమ్ముకుని ముందుకు సాగా. వైసీపీ ఆవిర్భావం తర్వాత దేశ రాజకీయాల్లో కూడా మార్పులు కనిపించాయి. వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ గర్వంగా కాలర్ ఎగరేసేలా పార్టీ నిలుస్తుంది. ఈ పార్టీ కొన్ని కోట్ల మంది ప్రజలది. అందరి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా పార్టీ నిలిచింది. పార్టీ లోపల ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తాం. నాపై ప్రేమాభిమానాలు చూపుతున్న కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వైసీపీని అభిమానించే ప్రతి ఒక్కరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ తెలిపారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..