ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఇంటరెస్టింగ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అప్పటి నుంచి పుష్పరాజ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో కోసం…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
మా ఎన్నికల ప్రచారం పోటాపోటీగా నడుస్తోంది. రెండు ప్యానల్స్ సభ్యులు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మెగాహీరోలు ఎవరు పోటీ చేసి ఉన్నా తన కుమారుడు మంచు విష్ణును పోటీనుంచి తప్పించి ఏకగ్రీవం చేసి ఉండేవాడినని మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. చిరంజీవితో తన స్నేహం ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుందని, పోటీ నుండి విష్ణుని ఉపసంహరించుకోమని చిరంజీవి తనను అడిగాడని వస్తున్న పుకార్లను ధృవీకరించలేనని అంటున్నారు మోహన్ బాబు. ఒకవేళ చిరంజీవి కుమారుడు…
(అక్టోబర్ 4న ‘డాడీ’కి ఇరవై ఏళ్ళు పూర్తి) మెగాస్టార్ చిరంజీవికి 2001వ సంవత్సరం నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నటించిన ‘మృగరాజు’ చేదు అనుభవాన్ని మిగల్చగా, ‘శ్రీమంజునాథ’ కూడా ఆశించిన స్థాయిలో అలరించలేదు. అయితే ‘డాడీ’ చిత్రం మాత్రం నటునిగా ఆయనకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ చిత్రంలోనే అల్లు అర్జున్ తొలిసారి తెరపై నర్తిస్తూ కనిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం…
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా…
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేన.. ఇవాళ శ్రమదానానికి పిలుపునిచ్చింది.. ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు జనసేన చీఫ్.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. అసలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడు రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో…
ఒకే రోజున ఒకే హీరో నటించిన రెండు చిత్రాలు విడుదలయితే అది అభిమానులకు పెద్ద విశేషమే! అలాగే ఒకే రోజున ఒకే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు కూడా పలుమార్లు విడుదలయ్యాయి. వాటినీ ముచ్చటించుకున్నాం. కానీ, ఒకే రోజున ఒకే దర్శకుని రెండు చిత్రాలు విడుదల కావడం వాటిలోనూ కొన్ని విశేషాలు చోటు చేసుకోవడం మరింత విశేషమే కదా! సరిగ్గా 35 సంవత్సరాల క్రితం అంటే 1986 అక్టోబర్ 2వ తేదీన ఆ ముచ్చట జరిగింది. ప్రముఖ…
రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల్లాడుతూ.. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని వెల్లడించారు. తనది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తనకు కడుపులో మంట వచ్చేదని… ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదన్నారు. అల్లు రామలింగయ్యగారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి…
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్…