“ఆచార్య”తో పోటీకి సై… తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో, హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పండగల సమయంలో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరిని ఆఫ్ సీజన్గా పరిగణిస్తారు. కానీ కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆన్, ఆఫ్ సీజన్ సెంటిమెంట్లతో సంబంధం లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 2022 మొదటి వారంలోనే థియేటర్లు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” ఫిబ్రవరి 4న వస్తుంది. మొదట్లో చిరుకి సోలో రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా స్టార్ హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. సూర్య తన నెక్స్ట్ మూవీతో, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ స్పోర్ట్స్ డ్రామాతో చిరుకి పోటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం “ఎతర్క్కుం తునింధవన్” పనుల్లో బిజీగా ఉన్నాడు. నవంబర్లో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ధృవీకరించారు. మరోవైపు తాప్సీ పన్ను తన రాబోయే చిత్రం “శభాష్ మిథు” కోసం అదే రోజున బాలీవుడ్లో విడుదల స్లాట్ను బుక్ చేసుకుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Read Also : యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది. ఇక “శభాష్ మిథు”ను కూడా తెలుగులో డబ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మిథాలీ రాజ్ హైదరాబాద్కు చెందినది. పైగా క్రికెట్ ప్రియులంతా ఆమె బయోపిక్ కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇంకా తాప్సీ దక్షిణాదిలో ఓ ప్రముఖ హీరోయిన్. మరి ఈ సినిమాల నిర్మాతలు “ఆచార్య”తో కలిసి తమ తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వెళతారా? లేదా తరువాత తేదీకి వాయిదా వేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే “ఆచార్య” మెగా మల్టీస్టారర్… మెగాస్టార్ కు ఆయన తయుడికి సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ 40 నిముషాలు కనిపించబోతున్నాడు. “ఆచార్య” గురించి ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!