“ఆచార్య”తో పోటీకి సై… తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో, హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పండగల సమయంలో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫిబ్రవరిని ఆఫ్ సీజన్గా పరిగణిస్తారు. కానీ కోవిడ్ -19 మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆన్, ఆఫ్ సీజన్ సెంటిమెంట్లతో సంబంధం లేకుండా పెండింగ్లో ఉన్న అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఫిబ్రవరి 2022 మొదటి వారంలోనే థియేటర్లు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” ఫిబ్రవరి 4న వస్తుంది. మొదట్లో చిరుకి సోలో రిలీజ్ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా స్టార్ హీరో, హీరోయిన్లు రంగంలోకి దిగుతున్నారని సమాచారం. సూర్య తన నెక్స్ట్ మూవీతో, బాలీవుడ్ బ్యూటీ తాప్సీ స్పోర్ట్స్ డ్రామాతో చిరుకి పోటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
Also Read
సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం “ఎతర్క్కుం తునింధవన్” పనుల్లో బిజీగా ఉన్నాడు. నవంబర్లో సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా తమిళ వెర్షన్ ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ధృవీకరించారు. మరోవైపు తాప్సీ పన్ను తన రాబోయే చిత్రం “శభాష్ మిథు” కోసం అదే రోజున బాలీవుడ్లో విడుదల స్లాట్ను బుక్ చేసుకుంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ బయోగ్రాఫికల్ డ్రామా దిగ్గజ క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
Read Also : యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం
ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఈ రెండు చిత్రాలు కూడా తెలుగులోకి డబ్ అయ్యే అవకాశం ఉంది. సూర్యకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉండడంతో ఆయన ప్రతి సినిమా తెలుగులోకి డబ్ అవుతుంది. ఇక “శభాష్ మిథు”ను కూడా తెలుగులో డబ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మిథాలీ రాజ్ హైదరాబాద్కు చెందినది. పైగా క్రికెట్ ప్రియులంతా ఆమె బయోపిక్ కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఇంకా తాప్సీ దక్షిణాదిలో ఓ ప్రముఖ హీరోయిన్. మరి ఈ సినిమాల నిర్మాతలు “ఆచార్య”తో కలిసి తమ తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు వెళతారా? లేదా తరువాత తేదీకి వాయిదా వేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే “ఆచార్య” మెగా మల్టీస్టారర్… మెగాస్టార్ కు ఆయన తయుడికి సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ 40 నిముషాలు కనిపించబోతున్నాడు. “ఆచార్య” గురించి ప్రేక్షకులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!