Chinese Spy Ship: వారం రోజుల తర్వాత శ్రీలంక ఓడరేవును విడిచి వెళ్లిన చైనా నౌక
Chinese Spy Ship: శ్రీలంకలో చైనా నిర్మించిన హంబన్తోట ఓడరేవు వద్ద ఓడరేవుకు చేరుకున్న చైనా సైనిక సర్వే నౌక వారం రోజుల తర్వాత సోమవారం తిరుగు ప్రయాణమైంది. ఈ నౌక శ్రీలంకకు రావడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ నౌకకు శ్రీలంక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హంబన్ టోట రేవును చైనా నిర్వహిస్తోంది. శాటిలైట్, రాకెట్, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షించే చైనా నౌకల సమూహంలో యువాన్ వాంగ్ 5 ఒకటి అని విశ్లేషకులు అంటున్నారు. శ్రీలంక పొరుగున ఉన్న భారత్.. చైనా ఈ ఓడరేవును సైనిక స్థావరంగా ఉపయోగించుకోవచ్చని భయాందోళనకు గురైన సంగతి తెలిసిందే.
హంబన్ టోట రేవును చైనా ఆధీనంలో ఉండడంతో.. గూఢచార నౌకలను భారత భూభాగానికి సమీపంలోకి తీసుకువస్తోందని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా పరిశోధన, సర్వే నౌకగా శ్రీలంక తీరానికి వచ్చిన యువాన్ వాంగ్-5 నౌకలో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాలపై ఓ కన్నేసి ఉంచగల సాధన సంపత్తి ఉందని భారత్ ఆరోపిస్తోంది.
Also Read
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక
ఆ భారత్కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని రక్షణ శాఖ పేర్కొంది. భారతదేశం ఆందోళనల మధ్య ఈ స్పై షిప్ రాకను వాయిదా వేయాలని చైనాను శ్రీలంక గతంలో కోరింది. కానీ చైనా ఒత్తిడికి తలొగ్గి శ్రీలంక అనుమతి జారీ చేసింది. వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11నే హంబన్ టోట రేవుకు చేరాల్సి ఉంది. అయితే భారత్ అభ్యంతరాల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం జాప్యం చేసింది. దాంతో ఆ చైనా నౌక ఐదు రోజుల ఆలస్యంగా ఆగస్టు 16న లంక తీరానికి చేరింది. ఇంధనం, ఆహార పదార్థాలు, మంచినీరు, తదితర నిత్యావసరాలు నింపుకున్న పిదప నేటి సాయంత్రం 4 గంటలకు హంబన్ టోట రేవును వీడిందని హార్బర్ ముఖ్యాధికారి నిర్మల్ సిల్వా తెలిపారు. శ్రీలంకలోకి చైనా దౌత్య కార్యాలయం సూచించిన మేరకు ఆ నౌకా వర్గాలకు సహకారం అందించినట్లు హంబన్టోట పోర్టు వర్గాలు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
-
Venkatesh: మోహన్లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో