మావోయిస్టులు మరోసారి మెరుపుదాడికి దిగారు.. మావోల దాడిలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయని.. వారిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, పరిస్థితి విషమంగా ఉన్న…
దేవుడా ఎంతటి విచిత్రం.. మానవులు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారు. మనిషిని పుట్టించిన దేవుడికే కోర్టు నోటీసులు ఇస్తున్నారు. దేవుడిని విచారణకు హాజరు కావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ హాజరు కానీ పక్షంలో 10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ఇదెక్కడి విధి వైపరీత్యం.. ఎవరు ఇంతటి దారుణానికి పాల్పడింది ఎవరు అంటే.. బిలాస్ పూర్ హైకోర్టు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఒక శివాలయం ఉంది. అయితే ఆ శివాలయాన్ని అక్రమంగా ఆక్రమించిన స్థలంలో కట్టారని, శివాలయంతో సహా…
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. అని ఊరికే అన్నారా..? ఇప్పుడు ట్రెండ్ మారింది.. కొత్త తరహాలో ఆలోచిస్తోంది యూత్.. తమ పెళ్లి విషయంలోనూ.. పెళ్లికార్డు నుంచి.. పెళ్లి వేదిక.. ఇతర కార్యక్రమాలు అన్నీ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు.. తాజాగా, ఛత్తీస్గఢ్లోని యశ్పూర్ జిల్లా, ఫర్సభ సమితి, అంకిరా గ్రామానికి చెందిన లోహిత్ సింఘ్ వారి పెళ్లి సందర్భంగా.. వెడ్డింగ్ కార్డు రూపొందించిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. Read Also: భారీగా…
కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు…
ఛత్తీస్గఢ్ లో కిడ్నాప్ చేసిన గిరిజనులను వదిలి పెట్టారు మావోయిస్టులు. ఛత్తీస్ఘడ్లోని సుక్మా జిల్లాలో మరోసారి మావోయిస్టులు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. సుక్మా జిల్లాలోని బటేరులో ఐదుగురిని కిడ్నాప్ చేసారు మావోయిస్టులు. అయితే నిన్న అర్ధరాత్రి ఆ ఐదుగురు గిరిజనులను వదిలిపెట్టారు మావోయిస్టులు. ఇద్దరిని చితకబాది హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు… ఈ నెల 5న ఐదుగురు గిరిజనులను అడవిలోకి ఎత్తుకెళ్లరు మావోయిస్టులు. కొంటా బ్లాక్లోని పిట్ట గ్రామానికి చెందిన ఐదుగురు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కాల్పుల కలకలం రేగింది. సెలవుల విషయంలో జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు జవాన్లు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని తెలుస్తోంది. గాయపడ్డ జవాన్లను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మారాయిగూడెం వద్ద లింగంపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులో ఘటన చోటుచేసుకుంది. మృతులు బిహార్కు చెందిన రాజమణి యాదవ్, డంజి బంగాల్కు చెందిన రాజుమండల్గా గుర్తించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది.…
మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే కొందరూ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మావోల కీలక నాయకుడైనా హిద్మా కోసం పోలీసుల గాలింపులు ఆగడం లేదు. మావోలకు పట్టున్న ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోనూ వారు ఉనికిని కోల్పోతున్నారు. తాజాగా ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో 14 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ అభిషేక్ పల్లవ్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోలు లొంగిపోయిన అనంతరం జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్…
పెట్రో ధరల మంట మండుతోంది.. పెట్రోల్ బంక్కు వెళ్లాలంటేనే వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.110ను క్రాస్ చేసింది లీటర్ పెట్రోల్ ధర.. ఇక, డీజిల్ ధర కూడా తానే తక్కువ అనే స్థాయిలో పెరుగుతూనే ఉంది.. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ జిల్లాలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.120 మార్కును కూడా దాటేసింది.. డీజిల్ ధర రూ.110కిపైగానే ఉండడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పూర్తి…
పంజాబ్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కెప్టెన్ రాజీనామా తరువాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చన్నిని ఎంపిక చేసింది. చన్నీ ప్రమాణ స్వీకారం తరువాత పీసీపీ అధ్యక్షుడు సిద్ధూ రాజీనామా చేయడం, ఆ తరువాత రాజీ కుదరడంతో తిరిగి ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకోవడంతో అక్కడ ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చెప్పలేని విధంగా ఉన్నాయి. పంజాబ్ రాజకీయాలను రాజస్థాన్, చత్తీస్గడ్ ముఖ్యమంత్రులు వెయికళ్లతో గమనిస్తున్నారు. పంజాబ్ లో జరిగినట్టుగానే రాజస్థాన్, చత్తీస్గడ్లో కూడా జరిగే…