Chhattisgarh: ఆదర్శంగా ఛత్తీస్గఢ్.. స్పెషల్ పోలీస్ యూనిట్ లోకి ట్రాన్స్జెండర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh police induct 9 transgender people in ‘Bastar Fighters’ special unit: సమాజంలో ఓ రకంగా చిన్నచూసే ట్రాన్స్జెండర్లు తాము కూడా ఎందులో తీసిపోమనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తమ పోలీస్ శాఖలోకి తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లను రిక్రూట్ చేసుకుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఛత్తీస్గఢ్ పోలీసులు లింగవివక్షతను రూపుమాపేందుకు దీన్ని ఓ ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం 608 మంది ఎంపికైన అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కాంకేర్ జిల్లాకు చెందిన వారు కాగా.. మరొకరు బస్తర్ జిల్లాకు చెందిన వారు.
Read Also: Dirty Picture 2: తెరపై మరోసారి సందడి చేయనున్న సిల్క్ స్మిత..?
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
అయితే వీరిందరిని అత్యంత కీలకమైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించే ‘ బస్తర్ ఫైటర్స్’ విభాగంలోకి తీసుకుంటున్నారు. బస్తర్ డివిజన్ లోని ఏడు జిల్లాల నుంచి 53,336 దరఖాస్తులు రాగా.. ఇందులో 16 మంది ట్రాన్స్జెండర్లు, 37,498 పురుషులు, 15,822 మంది మహిళలు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. 16 మందిలో తొమ్మిది మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వీరికి రాయ్ పూర్ లోన పోలీస్ ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ ఇవ్వనున్నారు. 2020 నుంచి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ బలగాల్లో పోలీసులు, స్థానిక గిరిజనుల మధ్య అంతరాన్ని తగ్గించాలని.. స్థానికంగా ఉండే గిరిజనులను రిక్రూట్ చేసుకుంటోంది. వీరిని చేరికను సీఎం భూపేష్ భాఘేల్ ప్రశంసించారు. వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పోలీసు శాఖలోకి ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేందుకు మా ప్రభుత్వం ప్రారంభించిన ఒక అడుగు. లింగ వివక్షకు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు మరియు కానిస్టేబులరీలు చైతన్యవంతులయ్యేలా ఈ చర్య ఉందని’’ ప్రశంసించారు.
బస్తర్ ప్రాంతంలోని కంకేర్, నారాయణపూర్, కందగావ్, బీజాపూర్, దంతేవాడ, జగదల్పూర్, సుక్మా జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ అభయారణ్యం మావోలకు అడ్డాగా ఉంది. దీంతో ఆ ప్రాంతంపై పట్టు ఉండే గిరిజనులను తీసుకుంటే.. అక్కడి భాష, మాండళికం, భౌగోళిక స్వరూపాలపై వారికి పట్టు ఉంటుందని.. తర్వాత ఆ ప్రాంతంలో మావోయిస్టులను కట్టడి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!