పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని హోంమంత్రి జిల్లాలో మరో పెను ఘటన వెలుగు చూసింది. కవర్ధాలోని లోహార్దిహ్ గ్రామంలో హింసాత్మక గుంపు ఒక కుటుంబ సభ్యులను సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది.
Horrifying incident: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఐదుగురిని అత్యంత కిరాకతంగా హతమార్చారు. జిల్లాలోని కుంటలోని కోయిలిబెడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టిచంపారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల హింస చెలరేగుతోంది.
ఛత్తీస్గఢ్లో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. డీజే శబ్ధం కారణంగా ఓ వ్యక్తి యొక్క సిర పగిలి మెదడులో రక్తస్రావం జరిగింది. అనంతరం అంబికాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇంతలో.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు రాయ్పూర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. డీజే శబ్దం కారణంగా తల వెనుక భాగంలోని సిర పగిలి రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. READ MORE: Nani : ముచ్చటగా మురోసారి ‘నాని…
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. నక్సలైట్లు ప్రజాకోర్టును నిర్వహించి ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గ్రామస్తులకు మావోయిస్టులు మరణశిక్ష విధించారు. మూడో వ్యక్తిని విడుదల చేశారు. ఈ ఘటన బీజాపూర్లో చోటుచేసుకుంది.
Beer Party In School: ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న మస్తూరి ప్రాంతంలోని ఓ పాఠశాలలో బర్త్డే పార్టీలో విద్యార్థినులు బీరు తాగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్లో విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఉన్నత అధికారులు విషయాన్ని గ్రహించి వెంటనే విచారణ చెప్పట్టారు. అందిన సమాచారం ప్రకారం, భట్చౌరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.…
ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్గఢ్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
Gang Rape: ఛత్తీస్గఢ్ లోని జష్పూర్ జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో ఆరుగురు మైనర్ బాలురు సహా మొత్తం ఏడుగురు నిందితులు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జష్పూర్ జిల్లాలోని పాతల్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 1వ తేదీన సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన బాధితుడు సమీపంలోని మార్కెట్ లోని జాతరను సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన…
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడలో మంగళవారం భద్రతా బలగాలకు, నక్సల్స్కి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కనీసం 09 మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని మార్హ్లో భద్రతా బలగాలు-నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కాగా.. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు సహా నక్సల్స్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.