Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం.. ఏడుగురిపై ఆరోపణలు..!
- జార్ఖండ్లో బయటపడిన మద్యం కుంభకోణం..
- ఈ స్కామ్ లో ఏడుగురి పాత్ర ఉందని ఆరోపించిన ఈఓడబ్ల్యూ..
- నిందితులపై మోసం.. నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు
Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్పూర్లో జరిగినట్లు తేలింది. రాయ్పూర్లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్ఐఆర్లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది. ఈఓడబ్ల్యూ తన ఎఫ్ఐఆర్లో అన్వర్ ధేబర్, ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్తో సహా ఏడుగురిపై ఆరోపణలు చేసింది. వారిపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. నిందితుల్లో జార్ఖండ్లోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి.
Read Also: MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
Also Read
అయితే, ఈఓడబ్ల్యూ తెలిపిన ప్రకారం.. డిసెంబర్ 2022లో జార్ఖండ్ మద్యం పాలసీ టెండర్లో మార్పులు చేయబడ్డాయని చెప్పుకొచ్చింది. రాయ్పూర్లోని అన్వర్ ధేబర్ రహస్య స్థలంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్, జార్ఖండ్ ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. సుమిత్ కంపెనీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది.. దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పుకొచ్చింది. అలాగే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నకిలీ హాలోగ్రామ్లు వేసి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా చేయగా.. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చిందని పేర్కొనింది. ఈ స్కాం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఈఓడబ్ల్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్ ఇంటికి పట్టుకెళ్లండి!
కాగా, ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి రూ.11 కోట్ల భద్రతా నిధిని కేటాయించిందని ఈఓడబ్ల్యూ తెలిపింది. దీంతో పాటు ఒక ఉద్యోగి అవసరాన్ని కూడా తీర్చిందని చెప్పుకొచ్చింది. ఇక, 6 నెలల్లో రూ.200 కోట్ల టర్నోవర్ సాధించాల్సి వచ్చింది.. ఆ సమయంలో టెండర్ ప్రక్రియలో భాగమైన మద్యం హోల్సేల్ టెండర్లో పాల్గొన్నందుకు రూ.25 లక్షలు నాన్రిఫండబుల్గా నిర్ణయించారని పేర్కొనింది. లిక్కర్ స్కామ్ పై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ స్పందించారు. గతంలో ఛత్తీస్గఢ్కు చెందిన మద్యం మాఫియాలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని.. అయితే ఈసారి పంజాబ్, హర్యానాల నుంచి లిక్కర్ మాఫియాలను రప్పించేందుకు జార్ఖండ్ సర్కార్ ప్లాన్ చేస్తుందన్నారు. అలాగే, బిర్సా ముండా జైలు నుంచే ఈ స్కామ్కు స్క్రిప్ట్ రాస్తున్నారని జార్ఖండ్ బీజేపీ చీఫ్ ఆరోపించారు.
घोटालों, चोरी और धोखाधड़ी के लिए कुख्यात हेमंत सोरेन सरकार जाते-जाते एक बार फिर से बड़ा शराब घोटाला करने की तैयारी में है।
पहले भी मैंने झारखंड में संभावित शराब घोटालों के बारे में चिंता व्यक्त की थी और मुख्यमंत्री जी को इस बारे में चेताया था, लेकिन उन्होंने नैतिकता को पूरी तरह… pic.twitter.com/yhtqoJZrPP
— Babulal Marandi (@yourBabulal) September 25, 2024
తాజావార్తలు
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
-
Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
-
Property Law India: తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలకు హక్కు ఉందని అనుకుంటున్నారా? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!