Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం.. ఏడుగురిపై ఆరోపణలు..!
- జార్ఖండ్లో బయటపడిన మద్యం కుంభకోణం..
- ఈ స్కామ్ లో ఏడుగురి పాత్ర ఉందని ఆరోపించిన ఈఓడబ్ల్యూ..
- నిందితులపై మోసం.. నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Liquor Scam: జార్ఖండ్లో మద్యం కుంభకోణం మొత్తం కుట్ర రాయ్పూర్లో జరిగినట్లు తేలింది. రాయ్పూర్లోని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (EOW) తన ఎఫ్ఐఆర్లో ఈ స్కామ్ గురించి ప్రస్తావించింది. ఈఓడబ్ల్యూ తన ఎఫ్ఐఆర్లో అన్వర్ ధేబర్, ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్తో సహా ఏడుగురిపై ఆరోపణలు చేసింది. వారిపై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది. నిందితుల్లో జార్ఖండ్లోని ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి.
Read Also: MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
Also Read
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
- Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
అయితే, ఈఓడబ్ల్యూ తెలిపిన ప్రకారం.. డిసెంబర్ 2022లో జార్ఖండ్ మద్యం పాలసీ టెండర్లో మార్పులు చేయబడ్డాయని చెప్పుకొచ్చింది. రాయ్పూర్లోని అన్వర్ ధేబర్ రహస్య స్థలంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ త్రిపాఠి, అనిల్ తుతేజా, అరవింద్ సింగ్, జార్ఖండ్ ఎక్సైజ్ అధికారులు హాజరయ్యారు. సుమిత్ కంపెనీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసింది.. దీని వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్పుకొచ్చింది. అలాగే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో నకిలీ హాలోగ్రామ్లు వేసి రాష్ట్రవ్యాప్తంగా మద్యం సరఫరా చేయగా.. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చిందని పేర్కొనింది. ఈ స్కాం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని ఈఓడబ్ల్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Yamaha : కేవలం రూ. 2,999కట్టి ఈ కంపెనీ టూవీలర్స్ ఇంటికి పట్టుకెళ్లండి!
కాగా, ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికి రూ.11 కోట్ల భద్రతా నిధిని కేటాయించిందని ఈఓడబ్ల్యూ తెలిపింది. దీంతో పాటు ఒక ఉద్యోగి అవసరాన్ని కూడా తీర్చిందని చెప్పుకొచ్చింది. ఇక, 6 నెలల్లో రూ.200 కోట్ల టర్నోవర్ సాధించాల్సి వచ్చింది.. ఆ సమయంలో టెండర్ ప్రక్రియలో భాగమైన మద్యం హోల్సేల్ టెండర్లో పాల్గొన్నందుకు రూ.25 లక్షలు నాన్రిఫండబుల్గా నిర్ణయించారని పేర్కొనింది. లిక్కర్ స్కామ్ పై జార్ఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ స్పందించారు. గతంలో ఛత్తీస్గఢ్కు చెందిన మద్యం మాఫియాలు ఈ కుంభకోణానికి పాల్పడ్డాయని.. అయితే ఈసారి పంజాబ్, హర్యానాల నుంచి లిక్కర్ మాఫియాలను రప్పించేందుకు జార్ఖండ్ సర్కార్ ప్లాన్ చేస్తుందన్నారు. అలాగే, బిర్సా ముండా జైలు నుంచే ఈ స్కామ్కు స్క్రిప్ట్ రాస్తున్నారని జార్ఖండ్ బీజేపీ చీఫ్ ఆరోపించారు.
घोटालों, चोरी और धोखाधड़ी के लिए कुख्यात हेमंत सोरेन सरकार जाते-जाते एक बार फिर से बड़ा शराब घोटाला करने की तैयारी में है।
पहले भी मैंने झारखंड में संभावित शराब घोटालों के बारे में चिंता व्यक्त की थी और मुख्यमंत्री जी को इस बारे में चेताया था, लेकिन उन्होंने नैतिकता को पूरी तरह… pic.twitter.com/yhtqoJZrPP
— Babulal Marandi (@yourBabulal) September 25, 2024
తాజావార్తలు
-
Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
-
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
-
CJP Protest: ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధం.. సీజేపీకి కేంద్రం మరోసారి పిలుపు..
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!