Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
- ఛత్తీస్గఢ్లో దారుణం..
- సుక్మా జిల్లాలో చేతబడి అనుమానంతో కుటుంబం హత్య..
- ఒకే కుటుంబంలోని ఐదుగురి దారుణహత్య..
- గ్రామస్తులంతా ఏకమై దారుణానికి పాల్పడ్డారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Horrifying incident: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఐదుగురిని అత్యంత కిరాకతంగా హతమార్చారు. జిల్లాలోని కుంటలోని కోయిలిబెడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టిచంపారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల హింస చెలరేగుతోంది.
ఈ హత్యలు ఆదివారం జరిగాయి. గ్రామస్తులు అంతా కలిసి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. మృతులను మౌసం కన్న(60), అతడి భార్య మౌసం బీరి(43), వీరి కుమారుడు మౌసం బుచ్చా(34), మౌసం బుచ్చా భార్య మౌసం అర్జో(32), కర్క లచ్చి(43)గా గుర్తించారు. చేతబడి చేస్తున్నారని ఆరోపించింన తోటి గ్రామాస్తులు వీరిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి మరణించేలా చేశారు.
Also Read
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
Read Also: PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం
ఈ ఘటనని జిల్లా ఎస్పీ చౌహాన్ కిరణ్ గంగారాం ధ్రువీకరించారు. ‘‘గ్రామస్తులు మూఢనమ్మకాలతో, కుటుంబంపై చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ, ఈ దారుణ చర్య కోసం ఏకమయ్యారు’’ అని తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందర్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బాధితులు కొంత కాలంగా ఇతర గ్రామస్తుల నుంచి అనుమానాలు, శత్రుత్వాన్ని ఎదుర్కొంంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామంలో పలు అకారణ మరణాలకు, అనారోగ్యాలు చోటు చేసుకోవడంతో వీరిపై అనుమానం మరింత బలపడి, చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఇదిలా ఉంటే, ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లానే కాకుండా బస్తర్ ఏరియా జిల్లాల్లో ఈ మంత్ర విద్యలు, చేతబడులు అధికంగా ఉంటాయనే మూఢనమ్మకం ఉంది.
తాజావార్తలు
-
Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!