Chhattisgarh: ఓవైపు యుపీలో తోడేళ్లు.. మరోవైపు ఛత్తీస్గఢ్లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు
- యూపీలోజనజీవనాన్ని కష్టతరం చేస్తున్న తోడేళ్లు
- మరోవైపు ఛత్తీస్గఢ్లో ఏనుగులు బీభత్సం
- ఛత్తీస్గఢ్లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్గఢ్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత 30 రోజుల్లో అడవి ఏనుగు దాడిలో ఐదుగురు మరణించారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో 65 ఏళ్ల వృద్ధ మహిళపై అడవి ఏనుగు దారుణంగా దాడి చేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఏనుగులు జనావాల వద్దకు చేరి ప్రజలను చితక్కొట్టడం ప్రారంభించాయి. వీటి దాడిలో గత నెలలో ఐదుగురు మరణించారు. బాల్కో ఫారెస్ట్ రేంజ్లోని బాగ్మారా గ్రామ సమీపంలో జరిగిన తాజా ఘటనలో రెండు ఎద్దులు కూడా మరణించాయి.
READ MORE: Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
శుక్రవారం రాత్రి గ్రామానికి సమీపంలోని వ్యవసాయ పొలంలో ఓ గుడిసెలో ఉన్న మహిళ భలై బాయి, ఆమె భర్తపై ఏనుగు దాడి చేసిందని కోర్బా అటవీ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అరవింద్ పీఎం తెలిపారు. ఆ సమయంలో ఇద్దరూ నిద్రపోతున్నారు. భలాయి బాయి భర్త అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఏనుగు అతని భార్యను తొక్కి చంపేశాయి. దీని తరువాత, ఈ అడవి ఏనుగు రెండు ఎద్దులపై కూడా దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబానికి రూ.25వేలు ఆర్థిక సాయం చేశామని, మిగిలిన రూ.5.75 లక్షలు విధిగా చెల్లిస్తామని అటవీశాఖ అధికారి తెలిపారు. అదే ఏనుగు సెప్టెంబర్ 4న కోర్బా జిల్లాలోని కత్ఘోరా ఫారెస్ట్ డివిజన్లో ఒక వృద్ధుడిని, ఆగస్టు 8న కత్ఘోరా ఫారెస్ట్ డివిజన్లోని వేర్వేరు ప్రదేశాలలో ముగ్గురు మహిళలను చితకబాది చంపడం గమనించదగ్గ విషయం.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!