తిరుపతిలోని రోబో డైనర్ హోటల్ నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్ను ఎంపీ మిథున్ రెడ్డి లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు నాయుడు తరచుగా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతుంటారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, ఐదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులకు, థియేటర్ల యాజమాన్యానికి ఇద్దరికీ నష్టం కలగకూడదని అన్నది ప్రభుత్వ…
ఒకప్పుడు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. కానీ ఆ తర్వాత ఆ అభిమానం చెదిరిపోయింది. వైసీపీలో చేరిన ఆ నేత కీలక పదవిని పొందారు. ఇప్పుడు చంద్రబాబుపై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలతో దాడి చేస్తున్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం. తాజాగా ఆయన చంద్రబాబుని చెడుగుడు ఆడేశారు. చంద్రబాబు ప్రజల విశ్వాసం కొల్పోయారని స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శించారు. మరో రెండు మూడు పర్యాయాలు జగనే ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన…
వంగవీటి రాధా ఇంటికి వెళ్ళిన చంద్రబాబునాయుడు ఆయనతో భేటీ అయ్యారు. తన హత్యకు రెక్కీ నిర్వహించారని కీలక వ్యాఖ్యలు చేశారు వంగవీటి రాధా. ఈ సందర్భంగా రెక్కీ వివరాలను ఆరా తీశారు చంద్రబాబు. రాధా భద్రతకు గన్ మెన్లను కేటాయించింది ప్రభుత్వం. అయితే వాటిని తిరస్కరించారు రాధా. తాజాగా చంద్రబాబు -రాధా ఇంటికి వెళ్ళడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడలో క్లబ్ దగ్గర ఉన్న వంగవీటి రాధా నివాసానికి వెళ్లారు చంద్రబాబు. వంగవీటి రాధ హత్యకు జరిగిన…
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు. పారిశ్రామిక…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత…
ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతోంది. తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కి నిర్వహించారని రాధా కామెంట్ చేయడంతో అసలేం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా వంగవీటి రాధా వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వంగవీటి రాధాకు చంద్రబాబు ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాధాపై రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు చంద్రబాబు. రాధా తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరించడం సరి కాదన్నారు చంద్రబాబు. వ్యక్తిగత భద్రత…
ఏపీలో ఓటీఎస్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే.. టీడీపీ మాత్రం అది పేద ప్రజల రక్తం పీల్చే పథకం అంటోంది. ఓటీఎస్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటానికి అభినందనలు తెలిపారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసన కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, పోలీసుల అడ్డుంకులు చేధించుకుని…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా.. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు డబ్బులు వేశాం. కానీ మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారు అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి…
ఇంఛార్జ్ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా.. మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ల పడుతున్న ఇబ్బందులేంటి? క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్ బ్యాక్ లేదా? ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంఛార్జులు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇంఛార్జులను నియమించే పనిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో…
రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్…