అమరావతిపై రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టాం: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు ప్రీమియం కంపెనీల బ్రాండ్లను అమ్ముతామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పన్నుల పేరుతో ప్రజలను ఈ ప్రభుత్వం దోచుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. చివరకు చెత్తపైన కూడా పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇటీవల రాష్ట్రంలో గంజాయి సరఫరా ఎక్కువ కావడంతో డ్రగ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఇతర రాష్ట్రాలు అవమానించే పరిస్థితి నెలకొందన్నారు.
మరోవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తేదీ వస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏపీకి అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు కూడా భయపడుతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపి ఎన్నికలు అయ్యాక జగన్ మాట మార్చారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై తాము రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టామని.. అమరావతిలో భవనాలన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారిపోయాయన్నారు. అమరావతిని విధ్వంసం చేయడం ద్వారా రూ. 2 లక్షల కోట్ల సంపదను నాశనం చేశారని మండిపడ్డారు.
Also Read
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Pawan Kalyan : ఇది కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనం
- Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
పోలవరంపై కాలయాపన చేసి రేట్లు పెంచారని… పోలవరం అసలు పూర్తవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయని తెలిపారు. ఏపీలో ఉన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయని… జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను నిరుద్యోగుల పాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా మారాయని.. బిల్లులు మంజూరు చేయకపోవడంతో రోడ్ల మరమ్మతులకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ప్రజావేదిక విధ్వంసంతో మొదలైన వైసీపీ పరిపాలన… ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు కావాలని పిల్లలు ఆందోళన చేసే పరిస్థితులు కల్పించారని చంద్రబాబు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!