ముందస్తు ఎన్నికలకు మేం రెడీ…. చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? వస్తే పార్టీలన్నీ రెడీగా వున్నాయా? అంటే అవుననే అంటున్నాయి. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబునాయుడు దీనిపై మనసులో మాట బయటపెట్టారు. మీడియాతో చిట్ చాట్ చేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా అన్నారు. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు.
పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు.గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు.ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారు.గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారు.ఈ గొడవలెందుకని ఇంకొందరు వలస పోతున్నారు.ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారు.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారన్నారు చంద్రబాబు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది.. వస్తే సిద్దంగా ఉన్నాం.పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. నేను దానిపై స్పందించను.కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదు.. దీంతో జగన్ బతికిపోయాడు.175 నియోజకవర్గాలతో సమావేశం అవుతాం.. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం.లీడర్ల పని చేయకుంటే మారిపోతారు.పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదు.పని చేయని ఇన్చార్ఝులను పక్కన పెట్టేస్తాం అని ఖరాఖండీగా చెప్పారు చంద్రబాబు.
ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.దిగుబడులు తగ్గాయి.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది.ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో దిగుబడుల్లో వెనకపడింది.మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది.టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చాం.. ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదు.ట్రాక్టర్లు.. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసింది. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం.టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తాడని ప్రజలు భావించారు.. ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయి.ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తాం అన్నారు చంద్రబాబునాయుడు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!