ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది.…
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు. 2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు.…
టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు. 40 ఏళ్ల…
TDP Women Leader Vangalapudi Anitha Made Sensational Comments on YCP Government. ప్రాంతీయ పార్టీగా ఉంటూ అనేక రిఫామ్స్ తీసుకు వచ్చింది టీడీపీ అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ ఆవిర్భవించి 40 వంసతాలు పూర్తి చేసుకున్నందన హైదరాబాద్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి అనిత పాల్గొని మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్ అయితే ఆత్మ విశ్వాసం పెంచింది చంద్రబాబు అని ఆమె కొనియాడారు. ఏపీ…
టీడీపీ పుట్టి 40 ఏళ్ళు అయ్యిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా సంబరాలు చేసుకోవడం లో తప్పు లేదు. 1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ను గద్దె దించటం కూడా చూడాల్సిన కోణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని. కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను…
కృష్ణా రాజకీయాలు ఎప్పుడూ ఎండాకాలం అంత హాట్ హాట్ గా వుంటాయి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగరేసిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వైసీపీ నేతలపై మండిపడ్డారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొంతమంది వెధవలు ప్రచారం చేస్తున్నారు. పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనే ఆవేదనతో ఆనాడు ఆ నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబుకు మద్దతిచ్చారు. వెన్నుపోటంటే జగన్ కే బాగా తెలుసు.తండ్రిని బెదిదిరించి…
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది.అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా…
తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ…
టీడీపీ ఆవిర్భావ వేడుకలను వివిధ దేశాల్లో జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. 40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టింది. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థ…
తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు…