PeddiReddy Ramachandrareddy: ఈసారి ఎన్నికల్లో మరిన్ని సీట్లు గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు తెలంగాణలో కూర్చుని ఏపీలో పాలన పై బురద జల్లుతున్నారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావాలు తెలుసుకుంటే మంచిదన్నారు.
2019లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలన ప్రజల దృష్టిలో సంక్షేమ పాలన. చంద్రబాబు, టీడీపీకి మాత్రమే ఇది సైకో పాలన లా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పాటు సైకో పాలన సాగింది. డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టిడిపిదే, వైసిపి లో అలాంటి సంస్కృతి లేదు. చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Road Accident: రాజమండ్రిలో రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు-ఆటో ఢీ..
- ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
జగన్ సీఎం అయ్యాక ఏ కుటుంబం ఆర్థికంగా చితికిపోకుండా ఆదుకుంటున్నారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందన్నారు. ప్రతి పిల్ల వాడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా, ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు నేడు తో ఆధునీకరిస్తున్నాం. కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వ తాతల వరకు అందరికీ ఆర్థిక అండ లభిస్తుంది. ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి, సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు సైతం ఇక్కడ అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమంపై అధ్యయనాలు చేస్తున్నాయి. 14 ఏళ్లలో మీరు ఇంత గొప్ప గా ఏం చేశారో చెప్పగలరాఝ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయి. లాంఛనంగా ఉగాది రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు. గతంలో జిల్లాలు సుదీర్ఘ ప్రాంతాలు ఉండటంతో పాలన లో ఇబ్బందులు ఉండేవి. ఉదాహరణ కు మదనపల్లె భారత దేశం లోనే పెద్ద డివిజన్. ఇప్పుడు జిల్లాల విభజన వలన అధికారులకు పట్టు ఉంటుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
-
Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
-
Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
-
September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!