Chandrababu: పార్టీ పుట్టిన ప్రదేశానికి అందుకే వచ్చాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు.
40 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీని స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి జరిగిన అవమానాలు చూసిన తర్వాత తెలుగు జాతికి ఏం చేయాలన్న దిశగా ఎన్టీఆర్ ఆలోచించారని.. ఆ ఆలోచనల నుంచే టీడీపీ పుట్టుకొచ్చిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పార్టీ ప్రారంభమైన తర్వాత ఈ 40 ఏళ్లలో ఎన్నో రికార్డులను లిఖించామని… మరెన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతిని, టీడీపీని ఏ ఒక్కరూ విడదీయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ప్రస్తుత రాజకీయాలను చూస్తే.. టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అన్నట్టుగా పరిస్థితి తయారైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోమారు తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కారణంతోనే పార్టీ పుట్టిన ప్రదేశానికి వచ్చామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!