టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
వారాహి యాత్రపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. సినిమా మొదలు పెట్టేటప్పుడు క్లాప్ కొట్టి చెప్పే డైలాగుల్లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. నాకు అధికారం అవసరం లేదు... ముఖ్యమంత్రి చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత ఇంకేంటి ప్రజల్లోకి వెళ్ళేదంటూ ప్రశ్నించారు. ఇది చంద్రయాత్ర అని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబును పొగడటమే పవన్ కళ్యాణ్ పని అంటూ కామెంట్స్ చేశారు.
మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని ఆయన ఆరోపించారు.
వరుసగా ఐదో సారి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు.
చంద్రబాబు లాంటి చీటర్ దేశంలో మరొకరు లేరంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయన్నారు.. పిచ్చికి పరాకాష్ట టీడీపీ ఛార్జ్షీట్ అని ఫైర్ అయ్యారు.. 600 హామీలు ఇచ్చి, ఆరు హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు.. సీఎం సంతకాలకు విలువ లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఇక, ఆస్తి కోసం కుటుంబీకులను వేధించిన…
సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇండస్ట్రీలో రక రకాలుగా చెప్పుకుంటారు. లక్ష్మీపార్వతి సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి రావడం వల్లే ఈ విధంగా జరిగిందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఎక్స్ ఐపీఎస్ నరసయ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ ప్రత్యర్థులు అందరూ చెబుతారని ఆయన కామెంట్లు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ఎన్టీఆర్…