Ambati Rambabu: చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరంకు తీవ్ర నష్టం చేకూరింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు. 2013-14 రేట్లతో పోలవరం పూర్తి చేస్తామని.. 2016లో చంద్రబాబు అంగీకరించి సంతకం చేశారని.. రూ. 1200 కోట్ల మేర నిధులు మినహా మొత్తం డబ్బులు తీసేసుకున్నారని ఆయన ఆరోపించారు. జగన్ కృషి వల్ల కేంద్రం మొదటి దశ పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించిందని ఈ సందర్భంగా చెప్పారు. రూ. 12,911 కోట్లు మొదటి విడత ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని.. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 20,946 పీడీఎఫ్లు ఉన్నాయన్నారు. లైడర్ సర్వే ప్రకారం అదనంగా 16,640 పీడీఎఫ్లు పెరిగాయన్నారు. వీటి కోసం అదనంగా రూ. 5 వేల కోట్లు అవసరం అవుతాయని కేంద్రానికి పంపామని మంత్రి తెలిపారు.
Also Read: Harish Rao: తెలంగాణ హెల్త్ హబ్గా.. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగాయి
Also Read
- ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
- Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
మంత్రులను చంద్రబాబు విమర్శిస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం, చంద్రగిరిని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. పులివెందులను అభివృద్ధి చేసిన వైఎస్సార్ను చూసి నేర్చుకోవాలన్నారు. మమ్మల్ని ఓ మాట అంటే వంద మాటలు అంటాం అని మంత్రి మండిపడ్డారు. పవన్ ఆరోపణలు చేస్తే బీజేపీ చేసినట్లేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ-జనసేన అలయెన్స్లో ఉన్నాయి కాబట్టి జనసేన చేసిన ఆరోపణలు బీజేపీ చేసినట్లేనన్నారు.
Also Read: BL Verma: అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిందే..
బురద జల్లి బీజేపీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ దగ్గర ఆధారాలు ఉంటే పేపర్ స్టేట్మెంట్ ఎందుకు.. నిరూపించాలన్నారు. సోము వీర్రాజు రోజూ చేస్తున్న ఆరోపణలే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లు చేస్తున్నారు.. కొత్తేం ఉందన్నారు. తన మీద పోటీకి టీడీపీ వస్తాదులను తెస్తోందని.. తనను ఓడించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. అన్ని పార్టీలు మారిన వ్యక్తిని నాపై పోటీకి నిలబెడుతున్నారన్నారు. నేను పార్టీలు మారి టిక్కెట్లు తెచ్చుకోను.. జగన్పై విశ్వాసంతో నేను సత్తెనపల్లి టిక్కెట్ తెచ్చుకుంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!