Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Montha Cyclone Damage Review Ap Seeks 2622 Crore Immediate Relief From Centre

Montha Cyclone Damage: సీఎంతో కేంద్ర బృందం భేటీ.. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలంటూ..

Published Date :November 11, 2025 , 4:55 pm
By Kothuru Ram Kumar
Montha Cyclone Damage: సీఎంతో కేంద్ర బృందం భేటీ.. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలంటూ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ISSF World Championships: చరిత్ర సష్టించిన సామ్రాట్ రాణా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కైవసం..!

Also Read

  • Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
  • US-Iran War: "ట్రంప్‌పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

తుపాను ప్రభావిత ప్రాంతాలైన కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ మధ్యంతర నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో మొత్తం రూ.5,267 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలోని 443 మండలాల్లోని 3,109 గ్రామాలు ఈ తుపాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ భారీ వర్షాలు, తుఫాను కారణంగా దాదాపు 10 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 9,960 ఇళ్లు నీట మునగగా.. 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అంతేకాకుండా తుపానుతో పాటు భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

తుపాను కారణంగా ప్రధానంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరగగా దీనివల్ల 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. మౌలిక సదుపాయాల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. మరోవైపు విద్యుత్ రంగానికి భారీ నష్టం వాటిల్లింది. ఏకంగా 12,856 విద్యుత్ స్తంభాలు నేలకూలగా, 2,318 ట్రాన్స్‌ఫార్మర్‌లు పాడయ్యాయి. పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు మొత్తం రూ.6,384 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.

Lionel Messi: 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ రారాజు..

తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని సురక్షిత ప్రాంతాల్లోని రిలీఫ్ క్యాంపులకు తరలించినట్టు ప్రభుత్వం కేంద్ర బృందానికి వెల్లడించింది. అంతేకాకుండా 3.36 లక్షల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంగా ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున పంపిణీ చేసినట్టు కేంద్ర బృందానికి వివరించింది. కేంద్రం నుండి తగినంత ఆర్థిక తోడ్పాటు లభిస్తే సహాయక చర్యలు మరింత వేగవంతమవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh cyclone relief
  • AP disaster relief
  • central team AP visit
  • Chandrababu Naidu
  • Cyclone Montha damage

తాజావార్తలు

  • Saudi Arabia: ఈ ముస్లిం దేశంలో మందు షాటేజ్.. ఖాళీ అవుతున్న ఏకైక షాపు! కారణం ఇదేనా..

  • Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..

  • US-Iran War: “ట్రంప్‌పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..

  • Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions