Ambati Rambabu : దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు
- తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు
- ఉచిత భోజనం కోసం భక్తులు 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు
- కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు
- నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను : అంబటి రాంబాబు
Ambati Rambabu : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రభుత్వ విధానాలు, దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ, తిరుమలలో 1985 నుంచి భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్నారని, ఇందుకోసం భక్తులు 27 వేల కోట్లకు పైగా విరాళాలు సమకూర్చారని తెలిపారు. “నేను అక్కడ భోజనం చేసినప్పుడు, భోజనం బాగుందని మాత్రమే చెప్పాను. దాన్ని కూడా రాజకీయంగా మలచటం చంద్రబాబు స్టైల్,” అని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడిని రాజకీయాలకు వాడటం వాళ్లకు అలవాటు అని, లడ్డూ ప్రసాదం విషయాన్ని చంద్రబాబు రాజకీయ రంగంలోకి లాగారంటూ వ్యాఖ్యానించారు.
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అంతేకాకుండా.. పేదలకు మెరుగైన వైద్యం అందించడం, పేద విద్యార్థులు డాక్టర్లు కావడానికి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ఆలోచనతో ముందుకు సాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. “మెడికల్ కాలేజీలను అమ్మేసి లోకేష్ జేబులు నింపాలనేది చంద్రబాబు ఉద్దేశం,” అని ఆరోపించారు.
వైసీపీ నేతలపై బురద చల్లడానికి చంద్రబాబు తన ఆధీనంలో ఉన్న మీడియాను వినియోగిస్తున్నారని కూడా అంబటి విమర్శించారు. “ముందుగా మీడియా కథనాలు రాయిస్తుంది. ఆ తర్వాత సిట్ వేసి, ఎవరో ఒకరిని తీసుకువచ్చి వైసీపీ నేతలపై స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇలా అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తారు,” అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!