CM Chandrababu Naidu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పలు అంశాలపై చర్చలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి విచ్చేశారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు సమావేశమై రాష్ట్రంలోని వ్యవసాయం, మైనర్ ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ కారణంగా పంటలకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ సహాయం, దీర్ఘకాలిక పునరుద్ధరణ చర్యల కోసం కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.
Jubilee Hills By Election Polling: షేక్ పేట్ లో లాఠీ ఝళిపించిన పోలీసులు
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
అలాగే మైనర్ ఇరిగేషన్ కింద సాగు చేసే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ప్రత్యేకంగా అభ్యర్థించారు. ముఖ్యంగా పీఎం-ఆర్కేవివై-పీడీఎంసీ (PM-RKVY-PDMC) పథకం కింద రాష్ట్రానికి అదనపు నిధులను కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ. 695 కోట్ల నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరారు. ఈ నిధులు మైనర్ ఇరిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, రైతులకు మరింత మెరుగైన సాగునీటి సౌకర్యాలను అందించడానికి దోహదపడతాయని ఆయన వివరించారు.
Faridabad University Raid: “టెర్రర్ క్లినిక్”.. హర్యానా ఆస్పత్రిలో జైషే లింకులు !
అంతేకాకుండా, రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (Market Intervention Scheme – MIS) కింద తోతాపూరి మామిడి రైతులకు గతంలో ఇచ్చిన మద్దతు ధర (MSP) లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను త్వరగా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. దీని ద్వారా రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం రాష్ట్రంలోని వ్యవసాయ రంగం, ఇరిగేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారాన్ని పెంచే దిశగా సానుకూల వాతావరణాన్ని కల్పించింది.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!