AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవే..!
- రూ. లక్ష కోట్లు పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- క్వాంటం కంప్యూటింగ్ విధానానికి ఆమోదం.. ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం
- విశాఖ, తిరుపతి, ఓర్వకల్లులో కొత్త పరిశ్రమలకు ఆమోదం
- రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వర్క్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
- OTR: కాపు ఓట్ బ్యాంక్ వైసీపీకి దూరమైందా.? లెక్కలు ఏం చెబుతున్నాయంటే.?
రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, స్టార్టప్లకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి రాబట్టాలని, సుమారు ఐదు వేల మంది నిపుణులు, స్టార్టప్లు ఏపీకి రావొచ్చని అంచనా వేశారు. పరిశ్రమల విస్తరణ దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో రహేజా సంస్థ కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఆమోదం లభించింది. కాపులుప్పాడ, తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు. ఓర్వకల్లులో డ్రోన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడానికి 50 ఎకరాలు కేటాయించగా.. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూప్కు భూమిని కేటాయించారు. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్ కోసం 150 ఎకరాలు కేటాయించారు.
అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన కేబినెట్ కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్ కోసం 300 ఎకరాలకుపైగా భూమి కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ, ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించనుంది. ఐటీ రంగం విస్తరణకు భాగంగా విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ద్వారా ఐటీ పార్క్ నిర్మాణానికి కేబినెట్ అనుమతి తెలిపింది.
Dinosaur: ఉత్తరప్రదేశ్లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?