AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవే..!
- రూ. లక్ష కోట్లు పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- క్వాంటం కంప్యూటింగ్ విధానానికి ఆమోదం.. ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం
- విశాఖ, తిరుపతి, ఓర్వకల్లులో కొత్త పరిశ్రమలకు ఆమోదం
- రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వర్క్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం
Also Read
- OTR : ఇంటింటికీ టీడీపి.. గోదావరి జిల్లాలో గ్లాస్ ఎమ్మెల్యేల గందరగోళం
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- OTR : కోఆర్డినేటర్లు మారినా మారని నేతలు.. అనంతపురంలో టిడిపికి తప్పని తలనొప్పి?
- OTR : అధిష్టానం పిలుపుతో తగ్గిన బొండా.. వైసీపీ నేతలపై విరుచుకుపడటం వెనుక రీజన్ ఏంటి?
రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, స్టార్టప్లకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి రాబట్టాలని, సుమారు ఐదు వేల మంది నిపుణులు, స్టార్టప్లు ఏపీకి రావొచ్చని అంచనా వేశారు. పరిశ్రమల విస్తరణ దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో రహేజా సంస్థ కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఆమోదం లభించింది. కాపులుప్పాడ, తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు. ఓర్వకల్లులో డ్రోన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడానికి 50 ఎకరాలు కేటాయించగా.. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూప్కు భూమిని కేటాయించారు. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్ కోసం 150 ఎకరాలు కేటాయించారు.
అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన కేబినెట్ కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్ కోసం 300 ఎకరాలకుపైగా భూమి కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ, ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించనుంది. ఐటీ రంగం విస్తరణకు భాగంగా విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ద్వారా ఐటీ పార్క్ నిర్మాణానికి కేబినెట్ అనుమతి తెలిపింది.
Dinosaur: ఉత్తరప్రదేశ్లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!