AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవే..!
- రూ. లక్ష కోట్లు పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- క్వాంటం కంప్యూటింగ్ విధానానికి ఆమోదం.. ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం
- విశాఖ, తిరుపతి, ఓర్వకల్లులో కొత్త పరిశ్రమలకు ఆమోదం
- రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వర్క్ స్టేషన్ల ఏర్పాటు నిర్ణయం
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం
Also Read
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు, నిపుణులు, స్టార్టప్లకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి రాబట్టాలని, సుమారు ఐదు వేల మంది నిపుణులు, స్టార్టప్లు ఏపీకి రావొచ్చని అంచనా వేశారు. పరిశ్రమల విస్తరణ దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో రహేజా సంస్థ కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఆమోదం లభించింది. కాపులుప్పాడ, తిరుపతి, ఓర్వకల్లులో పరిశ్రమల ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చారు. ఓర్వకల్లులో డ్రోన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడానికి 50 ఎకరాలు కేటాయించగా.. నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూప్కు భూమిని కేటాయించారు. అదేవిధంగా సిగాచి ఇండస్ట్రియల్ లిమిటెడ్ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంట్ కోసం 100 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో డోస్కో ఇండియా లిమిటెడ్ కోసం 150 ఎకరాలు కేటాయించారు.
అభివృద్ధి పైనే దృష్టి పెట్టిన కేబినెట్ కృష్ణా జిల్లా బాపులపాడులో 40 ఎకరాల్లో వేద ఇన్నోవేషన్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అనంతపురంలో టీఎంటీ బార్ ప్లాంట్ కోసం 300 ఎకరాలకుపైగా భూమి కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ అనుసంధాన స్పేర్ వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ, ప్రతి మండలంలో 20-30 వర్క్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించనుంది. ఐటీ రంగం విస్తరణకు భాగంగా విశాఖలో ఐటీ సంస్థల ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ద్వారా ఐటీ పార్క్ నిర్మాణానికి కేబినెట్ అనుమతి తెలిపింది.
Dinosaur: ఉత్తరప్రదేశ్లో 40 మిలియన్ల సంవత్సరాల నాటి డైనోసార్ శిలాజం లభ్యం..
తాజావార్తలు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!