ఓ వెధవ పనిచేసి బహిరంగంగా ఎవ్వరూ తిరగలేరన్న చంద్రబాబు.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పి పుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.. ఇలాంటి ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శ్రీలంక రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అయినా కుటుంబ పాలన వద్దని చెప్పానని పాల్ వెల్లడించారు. ఏపీకి అప్పులు భారంగా మారనున్నాయన్నారు.
Chandrababu Naidu Challenges On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంపై మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు కేంద్రం పేరు చెప్పి జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడం లేదన్నారు. ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం చేతకాకపోతే, జగన్ రాజీనామా చేయాలన్నారు. పోలవరం ఎందుకు పూర్తి…