K Narayana Swamy: అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Narayana Swamy Fires on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్లపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు. తనని ఎవరైనా ప్యాకేజ్ స్టార్ అని పిలిస్తే.. ఆ వైసీపీ నేతలను చెప్పుతో కొడతానని పవన్ కళ్యాన్ అనడం ఏమాత్రం సరికాదని అన్నారు. స్పెషల్ స్టేటస్ను వదిలి.. ప్యాకేజి క్రింద ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు ధనదాహం కోసం అమ్మేశారని ఆరోపించారు. చంద్రబాబుకు అప్పుడే ప్యాకేజీ బాబు అని ముద్ర పడిందని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా అదే ముద్ర పడిందని చెప్పారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్కి లేదని.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఈ రోజు కుల, మత, పార్టీల రాజకీయంతో ముందుకు పరిగెడుతున్నారని విమర్శించారు. అదే సీఎం జగన్ మాత్రం కాపుల్లో ఐదు మందికి మంత్రి పదవి, ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు.
అంతకుముందు.. మూడు రాజధానులకు అనుకూలంగా గళం విప్పిన నారాయణ స్వామి, అమరావతి ప్రాంత రైతుల పాదయాత్రను కూడా తప్పుపట్టారు. దీనిని తెరవెనుక ఉండి చంద్రబాబు నడిపిస్తున్నారని ఆరోపణలు చేశారు. 29 గ్రామాల ప్రజలు మాత్రమే బాగుపడాలని చంద్రబాబు కోరుకుంటోన్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ సారథ్యంలో తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల వారిని సమదృష్టితో చూస్తున్నారన్నారు. పేద ప్రజలు బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కొన్ని కార్పొరేట్ సంస్థలకు మేలు కలిగించేలా, తన బినామీల బాగు కోసం చంద్రబాబు వికేంద్రీకరణను వ్యతిరేకిస్తోన్నాడని మండిపడ్డారు. తెలంగాణ నుంచి వేరు పడిన సమయంలో హైదరాబాద్ను కోల్పోవడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని.. ఇప్పుడూ అలాంటి వ్యవస్థ కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని వెల్లడించారు.
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!