Janasena: కాపుల ఓట్ల కోసమే.. ఆ హత్యను వైసీపీ తెరపైకి తెచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Kapu Leaders Meeting: వైసీపీ కాపు నేతల సమావేశం అనంతరం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు మీటింగ్ పెట్టడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపట్ల అనవసరంగా వ్యాఖ్యలు చేసే వారికే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని వివరణ ఇచ్చారు. కాపుల ఓట్ల కోసమే రంగా హత్యను వైసీపీ తిరిగి తెరమీదకి తీసుకొచ్చిందని.. ఆ హత్యపై వైసీపీ నేతలు ఏవేవో అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. కాపుల ఐక్యతను చాటి చెప్పేందుకు.. రానున్న కాలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రంగా లాంటి నేత మళ్లీ తమకు దక్కడని, ఇప్పుడు తమకున్న ఒకే ఒక్క నమ్మకం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తమ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేసుకున్నామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారని, అన్ని కులాలకు సమన్యాయం చేయాలని ఆయన పాటు పడుతున్నారని జనసేన కాపు నేతలు పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు మాత్రం కేవలం రాజకీయాల కోసం వంగవీటి మోహన్ రంగా పేరుని వాడుకుంటున్నారని, ఆయన కుమారుడ్ని వైసీపీ కార్యకర్తలు అవమాన పరుస్తున్నారని చెప్పారు. తిరుపతిలో 45% కాపులుంటే, ఒక సామాజిక వర్గానికి వైసీపీ పెద్ద పెద్ద పదవుల్ని కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్లకు కాపు ఓట్లు కావాలే తప్ప, రాజ్యాధికారం ఇవ్వడం లేదని, తమ చెప్పుచేతల్లో కాపుల్ని పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇక పవన్, చంద్రబాబు కలయిక గురించి మాట్లాడుతూ.. కేవలం సంఘీభావం తెలిపేందుకు పవన్ని చంద్రబాబు కలిశారన్నారు. సీట్ల సర్దుబాటు గురించి వాళ్లిద్దరి మధ్య చర్చలే జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కలుస్తారోనన్న భయంతో.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!