Janasena: కాపుల ఓట్ల కోసమే.. ఆ హత్యను వైసీపీ తెరపైకి తెచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena Kapu Leaders Meeting: వైసీపీ కాపు నేతల సమావేశం అనంతరం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నేతలు మీటింగ్ పెట్టడం దౌర్భాగ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపట్ల అనవసరంగా వ్యాఖ్యలు చేసే వారికే పవన్ కళ్యాణ్ చెప్పు చూపించారని వివరణ ఇచ్చారు. కాపుల ఓట్ల కోసమే రంగా హత్యను వైసీపీ తిరిగి తెరమీదకి తీసుకొచ్చిందని.. ఆ హత్యపై వైసీపీ నేతలు ఏవేవో అసత్యాలు చెప్తున్నారని విమర్శించారు. కాపుల ఐక్యతను చాటి చెప్పేందుకు.. రానున్న కాలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రంగా లాంటి నేత మళ్లీ తమకు దక్కడని, ఇప్పుడు తమకున్న ఒకే ఒక్క నమ్మకం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. తమ సభలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తీర్మానం చేసుకున్నామని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారని, అన్ని కులాలకు సమన్యాయం చేయాలని ఆయన పాటు పడుతున్నారని జనసేన కాపు నేతలు పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు మాత్రం కేవలం రాజకీయాల కోసం వంగవీటి మోహన్ రంగా పేరుని వాడుకుంటున్నారని, ఆయన కుమారుడ్ని వైసీపీ కార్యకర్తలు అవమాన పరుస్తున్నారని చెప్పారు. తిరుపతిలో 45% కాపులుంటే, ఒక సామాజిక వర్గానికి వైసీపీ పెద్ద పెద్ద పదవుల్ని కట్టబెట్టిందని ఫైర్ అయ్యారు. వైసీపీ వాళ్లకు కాపు ఓట్లు కావాలే తప్ప, రాజ్యాధికారం ఇవ్వడం లేదని, తమ చెప్పుచేతల్లో కాపుల్ని పెట్టుకోవాలని చూస్తున్నారని తెలిపారు. ఇక పవన్, చంద్రబాబు కలయిక గురించి మాట్లాడుతూ.. కేవలం సంఘీభావం తెలిపేందుకు పవన్ని చంద్రబాబు కలిశారన్నారు. సీట్ల సర్దుబాటు గురించి వాళ్లిద్దరి మధ్య చర్చలే జరగలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కలుస్తారోనన్న భయంతో.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
తాజావార్తలు
-
IPL 2026 Playoffs Chances: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. నాలుగో స్థానం కోసం అసలు పోటీ, ఆ లక్కీ టీమ్ ఏదో!
-
Vijay : జాసన్ విజయ్ కు CM విజయ్ సపోర్ట్ ఉంటుందా.. సందీప్ కిషన్ తో సినిమా ఏమైంది?
-
Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!