Gudivada Amarnath: పవన్.. చెప్పుతో కొట్టడమంటే.. భీమవరం, గాజువాకలో ప్రజలు నీకిచ్చిన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Fires On Chandrababu & Pawan Kalyan: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు బాగా అబద్ధాలు చెబుతున్నారని.. ఇన్నాళ్లూ ముసుగులో కలిసిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు బయటకు వచ్చారని విమర్శించారు. ఇప్పటివరకూ కొనసాగించిన తమ అక్రమ సంబంధానికి ముగింపు పలికి.. ఇప్పట్నుంచి కొత్త బంధానికి తెరతీశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఇన్నాళ్లూ ప్రజలను ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన సంఘటనకు, వీళ్లు చెబుతున్న మాటలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దాడి చేసిన వారిని పరామర్శించటానికి చంద్రబాబుకు సిగ్గుందా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకపోతే.. ఇప్పుడు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ‘ప్యాకేజీ తీసుకున్నావని చెప్తే.. చెప్పుతో కొడతావా? మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చెప్పిందే నిజం చేశావుగా!’ అని వ్యాఖ్యానించారు.
కాపు కులాన్ని తీసుకుని వెళ్లి చంద్రబాబుకు అమ్మేద్దామని పవన్ చూస్తున్నాడని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ది కాపు కులమో కాదో తెలీదు కానీ.. అది చంద్రబాబుకి మాత్రం అనుకూలంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే చెప్పులు వేసుకుని తిరుగుతున్నావా? మాకు చెప్పులు లేవా? అని పేర్కొన్నారు. భీమవరం, గాజువాకలో ప్రజలు నీకు ఇచ్చిన తీర్పునే చెప్పుతో కొట్టడం అంటారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ది మూడు పెళ్లిళ్ల సిద్ధాంతమని.. పెళ్ళి చేసుకుని రెండు, మూడేళ్లు గడిపేసి.. డబ్బులిచ్చి వదిలించుకోమని పవన్ చెబుతున్నాడని ఆరోపణలు చేశారు. మూడో భార్య కూడా పవన్ని వదిలేసి ఉంటుందని, అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు పవన్ స్టెఫనీనో, పవన్కు చంద్రబాబు స్టెఫనీనో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయాడన్న మాటను పవన్ ఇవాళ రుజువు చేశాడన్నారు. రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందన్న పవన్.. రేపటి దాకా కూడా ఆగలేకపోయాడన్నారు.
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
నీది కాపుల జనసేన కాదు కమ్మ జనసేన అని పవన్పై అమర్నాథ్ ఘాటు విమర్శలు గుప్పించారు. తాము ఒక మిషన్ పూర్తి చేశామన్న ఆనందం నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ముఖాల్లో కనిపించిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ డైరెక్టర్ అయితే.. చంద్రబాబు ప్రొడ్యూసర్ అని పేర్కొన్నారు. రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు బయటకు రాకుండా చేయాలన్నదే చంద్రబాబు, పవన్ లక్ష్యమన్నారు. విశాఖపట్నం ఎట్టిపరిస్థితుల్లో రాజధాని అవుతందని అమర్నాథ్ చెప్పారు.
తాజావార్తలు
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!