ఇక నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ఢిల్లీలో ఉచిత బంగ్లా, భద్రత, డ్రైవర్ను కేటాయించే విధంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులకు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులకు కూడా ఈ సౌకర్యం వర్తించనుంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వ్యవహారం ప్రకంపనలు సృషిస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలుగు ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
CJI NV Ramana: విజయవాడలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. సిటి సివిల్ కోర్టు ఆవరణలో 3.70 ఎకరాల విస్తీర్ణంలో రూ. 92.60కోట్ల వ్యయంతో 8 అంతస్తులతో సిటి కోర్టు కాంప్లెక్స్ కోసం భారీ భవనాన్ని నిర్మించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం జగన్, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2013 మే 13న హైకోర్టు న్యాయమూర్తిగా…
VLC Media Player: అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా ప్లేయర్ సాఫ్ట్వేర్, స్ట్రీమింగ్ మీడియా సర్వర్ VLC మీడియా ప్లేయర్ ఇకపై భారతదేశంలో పని చేయదు. ఎందుకంటే VLC మీడియా ప్లేయర్పై భారత ప్రభుత్వం రెండు నెలల కిందటే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. మన దేశంలో VLC మీడియా ప్లేయర్, డౌన్లోడ్ లింక్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు కుదరడం లేదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు…
Har Ghar Tiranga: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా జెండాలను విక్రయిస్తున్నారు. అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో గత 10 రోజుల్లో ఏకంగా కోటి…
Fact Check on house Rent GST: గత నెలలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో కీలక మార్పులు చేసింది. ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించింది. దీంతో పాలు, పెరుగు ధరలు సామాన్యులకు భారంగా మారాయి. అయితే ఇంటి అద్దెపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. జీఎస్టీ కారణంగా ఇంటి అద్దెలు కూడా పెరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో…
Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో పన్నులను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో భాగంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు రెండో విడత పన్నుల వాటాను విడుదల చేసింది. తొలి వాటా కింద దేశంలోని…
India Invites American Singer to Independence Day Celebrations: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలకు అమెరికా ప్రసిద్ధ గాయని మిల్బెన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. ‘ఓం జయ్ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన అమెరికా గాయని మిల్బెన్ భారతీయులకు సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు.…
దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రం వైఖరికి నిరసనగానే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం లేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు. దేశంలో ఉచితాలను…