Ease Of Living: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్…
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
ఇప్పుడు అన్నింటికీ ఆధార్ నంబరే ఆధారం.. ఏ రిక్వెస్ట్ పెట్టాలన్నా ఆధార్ కార్డ్ కాపీని జత చేయాల్సిందే.. దీంతో, చాలా వరకు స్మార్ట్ ఆధార్ కార్డులను క్యారీ చేస్తున్నారు ప్రజలు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆధారు కార్డులను ఎక్కడపడితే అక్కడ జిరాక్స్ తీయించడం.. కొన్నిసార్లు సరిగారాలేదని వదిలేయడం.. మరికొన్నిసార్లు మర్చిపోవడం చేస్తూనే ఉన్నారు.. కొందరైతే.. తమ ఆధార్ వివరాలను సోషల్ మీడియాలోను పంచుకుంటున్నారు.. దీనిపై ఆధార్ కార్డు వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్కార్డు,…
Budget 2023: గత రెండేళ్లుగా బడ్జెట్లో వేతన జీవులకు నిరాశే మిగులుతోంది. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేతన జీవులకు ట్యాక్స్ మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. అయితే వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వేతన జీవులకు ఊరట లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని ఆర్ధిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4 శ్లాబుల ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. రూ.2.5 లక్షల ఆదాయం వరకు…
Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ…
వ్యవసాయంలో 10 శాతం వృద్ధి రేటు తెలంగాణ సాధించిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ముఖ్య అతిథిగా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, సీఎస్, ఆర్బీఐ, బ్యాంకర్లు.. హాజరయ్యారు.
Kapu Reservations: ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని…
Andhra Pradesh: విశాఖ రైల్వేజోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది.…
Andhra Pradesh: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉందని.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత మూడేళ్లుగా ఏపీలో అప్పుల…
Andhra Pradesh: దేశంలో అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో కలిపి 28,469 ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంటే మొత్తం కేసుల్లో ఏపీలోనే 39.86 శాతం కేసులు పెండింగ్లో ఉన్నాయి. Read…