Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Religious Conversion Serious Issue Dont Make It Political Says Supreme Court

Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు

Published Date :January 9, 2023 , 4:42 pm
By Mahesh Jakki
Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Supreme Court: మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది. బెదిరింపులు, బహుమతులు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టడం ద్వారా జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టాలని పిటిషనర్ కోరిన కేసులో హాజరుకావాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం వెంకటరమణిని కోరింది. ప్రలోభం ద్వారా మత మార్పిడులు జరుగుతున్నట్లయితే.. ఏం చేయాలి? దిద్దుబాటు చర్యలు ఏమిటి?.. అంటూ అటార్నీ జనరల్‌ చెప్పాలని ధర్మాసనం కోరింది. విచారణ ప్రారంభంలో తమిళనాడు తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్, ఈ పిటిషన్‌ను రాజకీయ ప్రేరేపిత పిల్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి మార్పిడుల ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు.

బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. “మీరు ఇలా ఆందోళన చెందడానికి వేరే కారణాలు ఉండవచ్చు. కోర్టు విచారణలను ఇతర విషయాల్లోకి మార్చవద్దు. … మొత్తం రాష్ట్రం కోసం మేము ఆందోళన చెందుతున్నాము. ఇది మీ రాష్ట్రంలో జరుగుతుంటే, ఇది చెడ్డది. కాకపోతే మంచిది. ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు. రాజకీయం చేయవద్దు.” మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

Read Also: Harassment Case: లైంగిక వేధింపుల కేసు.. సందీప్‌ సింగ్‌పై 7గంటల పాటు ప్రశ్నల వర్షం

బలవంతపు మత మార్పిడి జాతీయ భద్రతకు ప్రమాదకరం, పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలిగించవచ్చని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని, నిజాయితీగా ప్రయత్నించాలని కోరింది. మోసం, ప్రలోభాలు, బెదిరింపుల ద్వారా మతమార్పిడిని ఆపకపోతే చాలా క్లిష్ట పరిస్థితి తలెత్తుతుందని కోర్టు హెచ్చరించింది. మతస్వేచ్ఛలో ఇతరులను మతం మార్చే హక్కు ఉండదని గుజరాత్ ప్రభుత్వం అంతకుముందు విచారణలో సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read Also: Delhi Mayor Polls: ఢిల్లీలో హైటెన్షన్‌.. వీధుల్లో ఆప్, బీజేపీ పోటాపోటీ నిరసనలు

బలవంతపు మత మార్పిడి దేశవ్యాప్త సమస్య అని, తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో సమర్పించారు. “బహుమతులు, డబ్బులతో ప్రలోభపెట్టడం, బెదిరించడం, మోసపూరితంగా ప్రలోభపెట్టడం, మాయమాటలు, మూఢనమ్మకాలు, అద్భుతాలు చేయడం ద్వారా మతం మారుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి వారం నమోదవుతున్నాయి, కానీ కేంద్రం, రాష్ట్రాలు ఈ ముప్పును అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకోలేదు.” న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. బెదిరింపుల ద్వారా, ద్రవ్య ప్రయోజనాల ద్వారా మత మార్పిడిని నియంత్రించడానికి ఒక నివేదికతో పాటు బిల్లును సిద్ధం చేయడానికి లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ కోరింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7న జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Attorney General
  • central government
  • LATEST TELUGU NEWS
  • religious conversion
  • Supreme Court

తాజావార్తలు

  • Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో

  • Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!

  • Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!

  • Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత

  • BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions