గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం చేసిన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. 88 శాతానికి పైగా ఎక్స్పోర్ట్స్ కేవలం5 రాష్ట్రాల నుంచే జరగటం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిన్న శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య విషయంలో ఏపీ కంటే బీహారే బెటర్ పొజిషన్లో ఉందని కేంద్ర వాణిజ్య…
Apple Warning: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్లలో భద్రతాపరమైన లోపాలు తలెత్తవచ్చని టెక్ దిగ్గజం యాపిల్ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఈ పరికరాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకునే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ లోపాల అంశంపై వచ్చిన నివేదికపై తమకు పూర్తిగా అవగాహన ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు భద్రతా లోపాలపై యాపిల్ రెండు నివేదికలను విడుదల చేసింది. సఫారీతో పాటు యాపిల్ బ్రౌజర్…
Business Flash: జొమాటో షేర్ల విలువ ఇవాళ భారీగా పతనమైంది. అనూహ్యంగా 14 శాతం పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1000 కోట్లు ఆవిరైంది. ఈ సంస్థ షేర్లు 2021 జూలై 23న స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన సంగతి తెలిసిందే.
business headlines: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదిరిపోయే ఆదాయాన్ని నమోదుచేసింది. ఈ ఆర్థికం సంవత్సరంలోని మొదటి మూడు నెలల ఫలితాలను వెల్లడించింది. గ్రూపు సంస్థల మొత్తం ఆదాయం ఏకంగా 53 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లకు చేరింది.
Business Headlines: టాటా గ్రూప్ సంస్థలు 60 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించనున్నాయి. ఈ మేరకు ప్రధాన బ్యాంకులతోపాటు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాయి.
12 నెలల గరిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి దేశ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో 19 పాయింట్ 6 శాతానికి పెరిగింది. ఇది 12 నెలల గరిష్టం కావటం విశేషం. ఏప్రిల్ నెలలో ఇందులో దాదాపు సగం మాత్రమే అంటే 6 పాయింట్ 7 శాతమే నమోదైంది. ఆర్థిక వ్యవస్థ బాగానే కోలుకుంటోందనటానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ‘5జీ’కి జియో ఖర్చు 60 వేల కోట్లు! 5జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం కేంద్రం ఈ నెల 26న వేలం…
వంట నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ ఈ ఏడాది…
పబ్లిక్ ఆఫర్ పట్ల పునరాలోచనలో పడ్డ 3 స్టార్టప్లు? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల విషయంలో అంటే ఐపీఓల విషయంలో 3 స్టార్టప్లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫార్మ్ఈజీ, బోట్, ఇక్సిగో అనే ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. అన్లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్లో వీటి షేర్లకు క్రేజ్ తగ్గింది. దీంతో ఐపీఓల పట్ల ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపట్లేదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్లో పాల్గొని పేలవమైన ప్రదర్శన చేయటం ద్వారా బ్రాండ్ వ్యాల్యూని ఇంకా…
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన జాతీయ బ్యాంకులు. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంపు దేశంలోని రెండు జాతీయ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇండియన్ బ్యాంక్తోపాటు బంధన్ బ్యాంకు వడ్డీ రేట్లను 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మెచ్యూరిటీ గడువు ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉన్న ఎఫ్డీలకే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశాయి. దూసుకుపోతున్న ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు. జూన్లో…
టీవీఎస్ సంస్థకు చెందిన టూ వీలర్ వాహనాలలో స్కూటీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. భారత్లో టీవీఎస్ స్కూటీలు ఎంత ఆదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీవీఎస్ స్కూటీల విక్రయాలు భారత్లో 50 లక్షల మైలురాయికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా టీవీఎస్ సంస్థ వెల్లడించింది. మూడు దశాబ్దాలుగా తమ స్కూటీ వాహనాలకు మహిళలకు మెరుగైన ఎంపికగా ఉన్నందుకు తమకు గర్వగా ఉందని ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ…