Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
వంట నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
- Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
- Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్ డాలర్తో 95.23కి.. కారణాలు ఏమిటి?
రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ
ఈ ఏడాది ఇప్పటికే రూపాయి మారకం విలువ 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ నష్టనివారణ చర్యలను ప్రకటించింది. దేశంలోకి విదేశీ మారక ప్రవాహాన్ని పెంచేందుకు మార్గం సుగమం చేసింది. స్వల్ప కాల కార్పొరేట్ అప్పులతోపాటు మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు చేయటానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఇండియా ఫారెక్స్ నిల్వలు గత 9 నెలల్లో 40 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయాయి.
12 వారాల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతోపాటు కరోనా వల్ల చైనాలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో చమురు ధరలు 12 వారాల కనిష్టానికి దిగొచ్చాయి. సెప్టెంబర్ నెల బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ డెలివరీ 2.9 శాతం తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒక బ్యారెల్ రేటు 99 పాయింట్ ఏడు, ఎనిమిది డాలర్లు పలుకుతోంది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ రేటు 3.2 శాతం తగ్గటంతో ఒక పీపా ఇంధనం ధర ఇప్పుడు 96 పాయింట్ మూడు, ఒకటి డాలర్ల వద్ద ఉంది. ఈ రేట్లు వరుసగా 9 శాతం, 8 శాతం పడిపోయిన తెల్లారే ఈ తగ్గుదల కూడా జరగటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులకు చెక్ పెట్టిన కేంద్రం
ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండితోపాటు సంబంధిత ఉత్పత్తులన్నింటి ఎగుమతులకూ చెక్ పెట్టింది. దీంతో ఇతర దేశాలకు షిప్మెంట్లను పంపాలనుకునే ఎగుమతిదారులు ఇకపై మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా నిషేధం కాదు. ఎగుమతులను పాక్షికంగా అదుపు చేయటం మాత్రమే.
బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ ధర బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగింది. ఇంటి అవసరాలకు వాడుకునే 14 పాయింట్ 2 కేజీల ఎల్పీజీ సిలిండర్కి ఈ కొత్త రేటు వర్తిస్తుంది. 5 కేజీల సిలిండర్ రేటును కూడా 18 రూపాయలు పెంచారు. మరో వైపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు ఎనిమిదిన్నర రూపాయలు తగ్గింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!