Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పబ్లిక్ ఆఫర్ పట్ల పునరాలోచనలో పడ్డ 3 స్టార్టప్లు?
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల విషయంలో అంటే ఐపీఓల విషయంలో 3 స్టార్టప్లు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఫార్మ్ఈజీ, బోట్, ఇక్సిగో అనే ఈ మూడు సంస్థల మార్కెట్ విలువ భారీగా పడిపోయింది. అన్లిస్టెడ్ ఈక్విటీ మార్కెట్లో వీటి షేర్లకు క్రేజ్ తగ్గింది. దీంతో ఐపీఓల పట్ల ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపట్లేదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్లో పాల్గొని పేలవమైన ప్రదర్శన చేయటం ద్వారా బ్రాండ్ వ్యాల్యూని ఇంకా దిగజార్చుకోవటం ఎందుకని ఈ సంస్థలు ఆలోచిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
హైదరాబాద్కి మరో గ్లోబల్ కంపెనీ. సిటీలో శాఫ్రాన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ
విశ్వనగరంగా శరవేగంతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర సిగలోకి మరో గ్లోబల్ కంపెనీ రానుంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన శాఫ్రాన్ అనే ఇంజన్ల తయారీ సంస్థ భాగ్యనగరంలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. ఎంఆర్ఓ ఫెసిలిటీని అంటే మెయింటనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ సదుపాయాన్ని పెద్దఎత్తున ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు 15 కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఒక అంతర్జాతీయ సంస్థ మన దేశంలో తొలిసారిగా ఎంఆర్ఓ ఫెసిలిటీని ఏర్పాటుచేస్తుండటం విశేషం. ఇప్పటికే స్టార్టప్ల విషయంలో తెలంగాణ.. దేశంలోనే టాప్ లెవల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
లాభాలతో ప్రారంభమై.. భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఇవాళ బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమై భారీ లాభాలతో ముగిశాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ పొద్దున 300 పాయింట్లు పెరిగి 53,400కి చేరిన సెన్సెక్స్ సాయంత్రం ట్రేడింగ్ పూర్తయ్యేటప్పటికి 616 పాయింట్లు లాభపడి 53,750 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం 15,900 పాయింట్లకి చేరువలోకి వచ్చిన నిఫ్టీ చివరికి 178.95 పాయింట్లు పెరిగింది. 15,989.80 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఆటోమొబైల్, ఆర్థిక సేవల షేర్లకు ప్రాఫిట్స్ వచ్చాయి. హెచ్యూఎల్, ఏసియన్ పెయింట్స్ బాగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్ ఎక్కువ నష్టాన్ని మూటగట్టుకున్నాయి.
తాజావార్తలు
-
NTRNeel :’డ్రాగన్’ గ్లిమ్స్ అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందుగానే
-
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
-
IPL 2026 playoff scenarios: నేడు కీలక మ్యాచ్.. సీఎస్కే-ఎస్ఆర్హెచ్ పోరుతో మారనున్న ప్లేఆఫ్స్ సమీకరణాలు!
-
Sattu Chaas Recipe: మండుటెండలో కూల్గా ఉండాలా..? ప్రోటీన్ పవర్తో ‘సత్తు ఛాస్’ తాగండి!.. సింపుల్గా తయారు చేయండి..
-
Raghava Lawrence: రాజ్ మోహన్పై ట్రోల్స్.. విజయ్కు అండగా లారెన్స్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..