Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన జాతీయ బ్యాంకులు. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంపు
దేశంలోని రెండు జాతీయ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇండియన్ బ్యాంక్తోపాటు బంధన్ బ్యాంకు వడ్డీ రేట్లను 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మెచ్యూరిటీ గడువు ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉన్న ఎఫ్డీలకే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశాయి.
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
దూసుకుపోతున్న ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు. జూన్లో 27 శాతం పెరిగిన రిటైల్ సేల్స్
సెమీ కండక్టర్ల కొరత వల్ల కొన్నాళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం కాస్త తేరుకున్న సంకేతాలు వెలువడ్డాయి. గత నెలలో ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు దూసుకుపోయాయి. జూన్లో రిటైల్ సేల్స్ 27 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య తెలిపింది.
11 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ. మేలో 58.8 నుంచి జూన్లో 59.2కి పెరుగుదల
పర్చేజెస్ మేనేజర్ ఇండెక్స్ 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. మే నెలలో 58.8గా ఉన్న పీఎంఐ జూన్లో 59.2కి పెరిగింది. ‘ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్’ పీఎంఐ వరుసగా 11వ నెల కూడా పెరగటం విశేషం. కొత్త వ్యాపార వృద్ధి వేగానికి, సేవా సంస్థల ఔట్పుట్కి ఇది సూచిక అని నిపుణులు చెబుతున్నారు.
నిరాశపర్చిన జాతీయ కార్మిక గణాంకాలు. జూన్లో కోటీ 30 లక్షల ఉద్యోగాలు గోవిందా
జాతీయ కార్మిక గణాంకాలు నిరాశపర్చాయి. జూన్ నెలలో ఏకంగా కోటీ 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాన్ లాక్డౌన్ నెలలో ఇంత నిరుద్యోగం నమోదు కావటం ఇదే తొలిసారి.
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని విస్తరించిన కేంద్రం. ఇకపై ఇథనాల్ మిశ్రమానికీ ఇది వర్తింపు
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఈ పరిధిలోకి ఇథనాల్ మిశ్రమాన్నీ చేర్చింది. గ్యాసోలిన్లో 12 నుంచి 15 శాతం వరకు కలిపే ఇథనాల్కే ఈ ట్యాక్స్ బెనెఫిట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి మరియు వాడకంలో ఇండియా 3వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
బలపడ్డ డాలర్. బక్కచిక్కిన రూపాయి. ఒక డాలర్ కొనాలంటే ఇవ్వాల్సిన రూపాయలు 79.36
డాలర్ డైలీ బలపడుతోంది. దీంతో రూపాయి మళ్లీ బక్కచిక్కింది. ఫలితంగా ఒక డాలర్ కొనాలంటే 79 రూపాయల 36 పైసలు చెల్లించాల్సి వస్తోంది. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ త్వరలోనే 80 మార్కు దాటనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
11,000 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఇండియన్ స్టార్టప్స్
ఇండియన్ స్టార్టప్లు క్రమంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గడచిన 6 నెలల్లో 11 వేల మందికి పైగా స్టాఫ్ని ఇంటికి పంపాయి. ఎంప్లాయిస్కి ఉద్వాసన పలుకుతున్న స్టార్టప్ల లిస్టులో ఓలా, బైజుస్తోపాటు ఇతర యూనికార్న్లు ఉన్నాయి. పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరో రెండేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!