Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన జాతీయ బ్యాంకులు. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంపు
దేశంలోని రెండు జాతీయ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇండియన్ బ్యాంక్తోపాటు బంధన్ బ్యాంకు వడ్డీ రేట్లను 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మెచ్యూరిటీ గడువు ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉన్న ఎఫ్డీలకే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశాయి.
Also Read
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Gold Prices: షాకింగ్.. అమాంతం పెరిగిన బంగారం ధర.. తులం బంగారం ఎంతంటే..?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
దూసుకుపోతున్న ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు. జూన్లో 27 శాతం పెరిగిన రిటైల్ సేల్స్
సెమీ కండక్టర్ల కొరత వల్ల కొన్నాళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం కాస్త తేరుకున్న సంకేతాలు వెలువడ్డాయి. గత నెలలో ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు దూసుకుపోయాయి. జూన్లో రిటైల్ సేల్స్ 27 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య తెలిపింది.
11 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ. మేలో 58.8 నుంచి జూన్లో 59.2కి పెరుగుదల
పర్చేజెస్ మేనేజర్ ఇండెక్స్ 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. మే నెలలో 58.8గా ఉన్న పీఎంఐ జూన్లో 59.2కి పెరిగింది. ‘ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్’ పీఎంఐ వరుసగా 11వ నెల కూడా పెరగటం విశేషం. కొత్త వ్యాపార వృద్ధి వేగానికి, సేవా సంస్థల ఔట్పుట్కి ఇది సూచిక అని నిపుణులు చెబుతున్నారు.
నిరాశపర్చిన జాతీయ కార్మిక గణాంకాలు. జూన్లో కోటీ 30 లక్షల ఉద్యోగాలు గోవిందా
జాతీయ కార్మిక గణాంకాలు నిరాశపర్చాయి. జూన్ నెలలో ఏకంగా కోటీ 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాన్ లాక్డౌన్ నెలలో ఇంత నిరుద్యోగం నమోదు కావటం ఇదే తొలిసారి.
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని విస్తరించిన కేంద్రం. ఇకపై ఇథనాల్ మిశ్రమానికీ ఇది వర్తింపు
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఈ పరిధిలోకి ఇథనాల్ మిశ్రమాన్నీ చేర్చింది. గ్యాసోలిన్లో 12 నుంచి 15 శాతం వరకు కలిపే ఇథనాల్కే ఈ ట్యాక్స్ బెనెఫిట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి మరియు వాడకంలో ఇండియా 3వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
బలపడ్డ డాలర్. బక్కచిక్కిన రూపాయి. ఒక డాలర్ కొనాలంటే ఇవ్వాల్సిన రూపాయలు 79.36
డాలర్ డైలీ బలపడుతోంది. దీంతో రూపాయి మళ్లీ బక్కచిక్కింది. ఫలితంగా ఒక డాలర్ కొనాలంటే 79 రూపాయల 36 పైసలు చెల్లించాల్సి వస్తోంది. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ త్వరలోనే 80 మార్కు దాటనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
11,000 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఇండియన్ స్టార్టప్స్
ఇండియన్ స్టార్టప్లు క్రమంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గడచిన 6 నెలల్లో 11 వేల మందికి పైగా స్టాఫ్ని ఇంటికి పంపాయి. ఎంప్లాయిస్కి ఉద్వాసన పలుకుతున్న స్టార్టప్ల లిస్టులో ఓలా, బైజుస్తోపాటు ఇతర యూనికార్న్లు ఉన్నాయి. పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరో రెండేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Kerala CM Row: కేరళలో ముదిరిన కాంగ్రెస్ పోరు.. రాహుల్, ప్రియాంక గాంధీలకు వార్నింగ్..
-
Modi Cabinets: రైతులకు శుభవార్త.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
-
SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
-
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!